ప్రభుత్వ, ప్రయివేటు రంగాలు చేతులు కలిపితే వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలు ప్రస్తుత కరోనా సంక్షోభం నుండి బయటపడతాయని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అన్నారు. ఇలా చేయడం వల్ల వేగవంత వృద్ధి కూడా సాధ్యమవుతుందన్నారు. ప్రభుత్వం, ప్రయివేటు రంగాలు, ప్రజల మధ్య పరస్పర సహకారం అవసరమని చెప్పారు. డిజిటల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వ్యాపారాలను మార్చి వేస్తున్నాయన్నారు. కరోనా ప్రభావం కూడా వ్యాపారాలపై ఉందని అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వరంగ సంస్థలు బలంగా ఉండాలి
ప్రభుత్వరంగ సంస్థలు వ్యవస్థాగతంగా బలంగా ఉండటం ఎంతో అవసరమని సత్య నాదెళ్ల అన్నారు. ఆయన ఫిక్కీ ఏజీఎంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. తాను ఒక ప్రభుత్వ ఉద్యోగి కుమారుడిని అని, కాబట్టి ప్రభుత్వ రంగంపై కొంత అవగాహన ఉందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలు సాంకేతికంగా ముందుకు వెళ్లాలని, ప్రస్తుతం దేశంలో ఈ దిశగా కొంత కసరత్తు జరుగుతోందన్నారు. మార్పులను అందిపుచ్చుకునేందుకు ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం దోహదం చేస్తుందన్నారు. మార్పులు సంపూర్ణంగా ఉండాలన్నారు.

ప్రభుత్వ-ప్రయివేటు భాగస్వామ్యం అవసరం
కరోనా కారణంగా దెబ్బతిన్న వర్ధమాన దేశాలు పుంజుకోవాలంటే ప్రభుత్వ-ప్రయివేటు భాగస్వామ్యం అవసరమన్నారు. వేగవంతమైన వృద్ధికి కూడా ఇది అవసరమన్నారు. కరోనా సమయంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. వ్యాపారాల నిర్వహణకు చిన్న వ్యాపారులు కూడా డిజిటల్ వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. ఆర్థిక సేవల నుండి ఆరోగ్య సంరక్షణ, రిటైల్ వరకు అన్ని రంగాల్లో డిజిటల్ మౌలిక వసతులపరంగా భారత్లో వస్తున్న మార్పులను ప్రస్తావించారు.

సహకారం అవసరం
అధునికీకరణలో ప్రభుత్వరంగానికి సహకరించాల్సిన అవసరం ఉందని సత్య నాదెళ్ల అన్నారు. కాగా, కరోనా పరిస్థితి అదుపులోకి వచ్చాక భారత్కు అపరిమిత అవకాశాలు ఉన్నాయని, వీటని అందిపుచ్చుకునేందుకు భారత్ సిద్ధంగా ఉండాలని టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ కూడా అన్నారు. డేటా గోప్యత, డేటా నిల్వ, పన్నుల విషయంలో నియంత్రణపరమైన ప్రమాణాలను నెలకొల్పాల్సిన అవసరం ఉందన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications