Ticket Refund: విమాన ప్రయాణికులు తరచుగా ఎదుర్కొనే సమస్య విమానాల రద్దు, టిక్కెట్ల రద్దు లాంటివి. అయితే ఇలాంటి వారు ఎదుర్కొనే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తాజా మార్గదర్శకాలను అందుబాటులోకి తెచ్చింది.

సవరించిన రూల్స్..
విమాన ప్రయాణీకుల కోసం DGCA కొత్త నియమాలను తెస్తోంది. వీటి ప్రకారం బోర్డింగ్ తిరస్కరించబడినా లేక రద్దు, విమానాల ఆలస్యం అయినప్పుడు రీయింబర్స్ మెంట్ కు సంబంధించిన నిబంధనలను సవరించబడ్డాయి. వీటి ప్రకారం ఇప్పుడు దేశీయ విమాన టిక్కెట్ల ధరలో గరిష్ఠంగా 75% మెత్తాన్ని ప్రయాణీకులకు రీయింబర్స్ చేయాలని విమానయాన సంస్థలను ఆదేశించింది.

అంతర్జాతీయ ప్రయాణాలు..
విదేశీ ప్రయాణాలు చేసేటప్పుడు ఇదే సమస్య ఎదురైతే డౌన్గ్రేడ్ చేయబడిన అంతర్జాతీయ ఫ్లైయర్ల కోసం దూరాన్ని బట్టి రీయింబర్స్మెంట్ మొత్తం మారుతుందని డీజీసీఏ వెల్లడించింది. 1500 కిమీ లోపు ప్రయాణించే విమానానికి 30 శాతం, 1500-3000 కిమీ మధ్య ప్రయాణించే విమానానికి 50 శాతం, 3500 కిమీ కంటే ఎక్కువ ప్రయాణించే విమానాల విషయంలో 75 శాతం తిరిగి చెల్లించబడుతుందని డీజీసీఏ ప్రకటించింది.

ఫిబ్రవరి నుంచి..
తాజాగా సవరించిన రూల్స్ ఫిబ్రవరి 15 నుంచి అమలులోకి వస్తాయని తెలుస్తోంది. రిఫండ్ అమౌంట్ పన్నులతో సహా టిక్కెట్ ధర ఆధారంగా ఉంటుంది. ఇటీవల బెంగళూరు నుంచి గో ఫస్ట్ విమానం బోర్డింగ్ కోసం వేచి ఉన్న 50 మంది ప్రయాణికులను విడిచి వెళ్లిపోయింది. ఇలాంటి సందర్భంలో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురవుతారు. అందుకే భారత పౌర విమానయాన రంగం పేలవమైన సేవలపై పరిశీలనలో ఉంది.

స్ట్రిక్ట్ యాక్షన్.. గతంలో
గత నెలలో ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికులు తాగి తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జన చేయటం పెద్ద వివాదానికి కారణమైంది. దీనిపై రెండు సార్లుగా కంపెనీ రూ.40 లక్షల మెుత్తం జరిమానా పడింది. తాజా రూల్స్ కి ముందు డీజీసీఏ పై కారణాలతో ఇబ్బందిని ఎదుర్కొన్న ప్రయాణికులకు 100 శాతం అమౌంట్ రిఫండ్ తో పాటు తరువాతి విమానంలో ఉచితంగా ప్రయాణ టిక్కెట్టును విమాన సంస్థలు అందించాలని భావించింది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications