న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఢిల్లీ-మీరట్ రీజినల్ రాపిడ్ ట్రాన్సిస్ట్ సిస్టమ్లో అత్యాధునికమైన టికెట్ల జారీ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఇదివరకెప్పుడూ లేని సిస్టమ్ ఇది. ఢిల్లీ-మీరట్ ఆర్ఆర్టీఎస్ రైలులో ప్రయాణించాలంటే.. కార్డులు, క్యూఆర్ కోడ్ల ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. డిజిటల్ క్యూఆర్, పేపర్ క్యూఆర్ను స్కాన్ చేయడం ద్వారా ప్లాట్ఫామ్పై అడుగు పెట్టడానికి వీలవుతుంది. లేదా ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్ ద్వారా టికెట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
ఓపెన్ లూప్ కాంటాక్ట్లెస్ కార్డ్ ఆధారంగా రూపొందించిన నేషనల్ కామన్ మొబిలిటీ కార్డులను ప్రయాణికులు వినియోగించాల్సి ఉంటుందని నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వెల్లడించింది. యూరోపే, మాస్టర్కార్డ్, విసా కార్డులను వినియోగించే వారు కామన్ మొబిలిటీ కార్డులతో అనుసంధానం పొందాల్సి ఉంటుందని పేర్కొంది. ఢిల్లీ-మీరట్ ఆర్ఆర్టీఎస్ అందుబాటులోకి వచ్చిన తొలిరోజు నుంచే ఈ వ్యవస్థ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన మేక్ ఇన్ ఇండియాలో భాగంగా టికెట్లను జారీ చేయడంలో అత్యాధునిక వ్యవస్థను అమలు చేయనున్నట్లు పేర్కొందా కార్పొరేషన్. హైబ్రీడ్ యాన్యుటీ మోడెల్ను ప్రవేశపెట్టబోతోన్నామని స్పష్టం చేసింది. దీనికోసం అన్ని రకాల బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు జారీ చేసే కార్డులతో తమ టికెటింగ్ వ్యవస్థను అనుసంధానిస్తామని తెలిపింది. వన్ నేషన్, వన్ కార్డ్ వ్యవస్థకు తాము శ్రీకారం చుట్టబోతున్నామని, దేశవ్యాప్తంగా ఇదే కార్డుల ద్వారా ఇంటర్సిటీ, ఇంట్రాసిటీల్లో ప్రయాణించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications