గత ఏడాది (2019) సైబర్ నేరాల కారణంగా భారత్లో రూ.1.25 లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు నేషనల్ సైబర్ సెక్యూరిటీ కో-ఆర్డినేటర్ లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పంత్ తెలిపారు. సైబర్ భద్రత ఉత్పత్తులను కేవలం కొన్ని భారత్ కంపెనీలే ఉపయోగిస్తున్నాయని వెల్లడించారు. సైబర్ భద్రతకు ఒక పరిశ్రమ వేదికను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే సైబర్ దాడులకు అడ్డుకట్ట వేసేందుకు సొంతంగా సొల్యూషన్లను అభివృద్ధి చేసుకోవాలన్నారు.

సైబర్ నేరాలు పెరిగే అవకాశం
దేశంలో స్మార్ట్ నగరాలు, 5G నెట్ వర్క్ వంటివి తీసుకు వస్తుండటం వంటి కారణాల వల్ల భారత్లో సైబర్ నేరాల ముప్పు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని రాజేష్ పంత్ హెచ్చరించారు. సైబర్ భద్రతా ఉత్పత్తులను కొన్ని కంపెనీలే తయారు చేస్తుండటంతో ఈ రంగంలో శూన్యత ఉందన్నారు. విశ్వసనీయమై దేశీయ పరికరాల అభివృద్ధి ద్వారా సైబర్ దాడులకు అడ్డుకట్ట వేసేందుకు ఈ రంగానికి సంబంధించి ఒక ఫోరమ్ అవసరమన్నారు.

రాన్సమ్వేర్ దాడులు పెరుగుతున్నాయి
గత సంవత్సరం సైబర్ దాడుల కారణంగా భారత దేశంలో రూ.1.25 లక్షల కోట్ల మేర నష్టం జరిగిందన్నారు. రాన్సమ్వేర్ దాడులు ప్రతిరోజు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పైగా సైబర్ క్రైమ్స్ ఇంటి వద్ద నుండి చేస్తున్నారన్నారు. వారు చివరకు ఆసుపత్రులపై కూడా దాడి చేస్తున్నారని, ఎందుకంటే అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రి యాజమాన్యాలు చెల్లింపులకు ముందుకు వస్తారని వారికి తెలుసన్నారు.

మొబైల్ ఫోన్లపై ఇలా దాడి
మొబైల్ ఫోన్ వంటి పరికరాలకు ఎన్నో ప్రమాదాలున్నాయన్నారు. మొబైల్ ఫోన్పై దాడుల తీరును విశ్లేషించామని, కేవలం యాప్స్ పైనే కాదు పదిహేను రకాల విభిన్న మార్గాల్లో దాడులు జరుగుతున్నాయన్నారు. ఆపరేటింగ్ సిస్టమ్, ప్రాసెసర్లు, మెమొరీ చిప్స్, కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్, బ్లూటూత్, వైఫై వంటివి కూడా ఉన్నట్లు తెలిపారు. ఫోన్లలో ముందుగానే ఇన్ స్టాల్ అయి ఉండే యాప్స్ చాలా వరకు డేటాను తరలిస్తున్నట్లు తెలిపారు.
More From GoodReturns

నేస్తం నేనున్నా.. భారత్కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications