కరోనా మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. ఆర్థిక వ్యవస్థలు కోలుకుంటున్న సంకేతాలు కనిపిస్తోన్నప్పటికీ మున్ముందు దీని ప్రభావం భారీగానే ఉండనుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావం మరో 20 కోట్ల మందిని తీవ్ర పేదరికంలోకి నెట్టి వేస్తోందని ఐక్య రాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం వెల్లడించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఉన్నవారితో కలిపి 2030 నాటికి దాదాపు 100 కోట్ల మంది కటిక పేదరికాన్ని అనుభవిస్తారని ఆందోళన వ్యక్తం చేసింది.
వచ్చే దశాబ్ద కాలంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై కరోనా ప్రభావం ఎలా ఉంటుందనే విషయమై ఐక్య రాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం తాజాగా అంచనా వేసింది. ఇందుకు యూనివర్సిటీ డెన్వర్ భాగస్వామ్యంతో అధ్యయనం చేపట్టింది. కరోనా ముందు పరిస్థితుల ప్రకారం 2030 నాటికి 4 కోట్ల మంది ప్రజలు తీవ్ర పేదరికంలో ఉంటారని ఐఎంఎఫ్ నివేదిక అంచనా వేసింది. కానీ ప్రస్తుత మరణాల రేటు, ఇటీవలి అభివృద్ధి అంచనాల ప్రకారం తాజాగా అంచనా వేశారు. కరోనా పరిస్థితుల్లో అన్నీ మారిపోయాయి.

మరణాల నష్టం ఎక్కువగా ఉండి, కరోనా తీవ్రత నుండి కోలుకోవడానికి సమయం పడితే 2030 నాటికి మరో 20 కోట్లమంది తీవ్ర పేదరికంలోకి వెళ్తారని ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం వెల్లడించింది. అంతేకాకుండా తీవ్ర నష్టాన్ని దృష్టిలో పెట్టుకుంటే కరోనా కారణంగా ఏర్పడ్డ ఈ ఆర్థిక సంక్షోభ ప్రభావం మరో పదేళ్ల పాటు సామాజిక భద్రత, సంక్షేమ కార్యక్రమాలు, డిజిటలీకరణ, ప్రభుత్వ పర్యవేక్షణ వంటి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా చేపట్టాల్సిన అవసరాన్ని తాజా నివేదిక గుర్తు చేసింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications