ఊరట కలిగించే విషయం... భారతదేశంలో కరప్షన్ తగ్గుతోందట. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత ఏడాదితో పోలిస్తే అవినీతి సూచీలో భారతదేశం మెరుగు కనబరిచింది. 180 దేశాల జాబితాలో భారత్ మూడు స్థానాలు ఎగబాకి 78వ స్థానానికి చేరుకుంది. ఇండియా కరప్షన్ సర్వే 2019 ప్రకారం గత ఏడాది ప్రతి ఇద్దరిలో ఒకరు లంచం సమర్పించారు. తద్వారా 51 శాతం మంది కరప్షన్లో ఇన్వాల్వ్ అయ్యారు.

ఎక్కువ లంచాలు వీరికే...
ఈ సర్వే ప్రకారం ఎక్కువగా లంచాలు పోలీసు, మున్సిపాలిటీ, ట్రాన్స్పోర్ట్ డిపార్టుమెంట్లకే అందాయని తెలిపింది. ఈ విభాగాలలో లంచాలు ఎక్కువగా డిమాండ్ చేసినట్లుగా తేల్చింది.

10 శాతం తగ్గిన అవినీతి
ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం 2019లో భారతదేశంలో కరప్షన్ 10 శాతం వరకు తగ్గింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 1.9 లక్షల మంది రెస్పాండెంట్స్ నుంచి అభిప్రాయాలు సేకరించి ఈ నివేదికను తయారు చేశారు. ట్రాన్సుపరెన్సీ ఇంటర్నేషనల్ సహకారంతో ఈ సర్వేను నిర్వహించారు.

2017లో లంచగొండితనం 45 శాతమే
అంతకుముందు ఏడాది లంచగొండితనం 56 శాతంగా ఉంది. ఇప్పుడు అది 51 శాతానికి తగ్గింది. 2017లో మాత్రం కేవలం 45 శాతం మంది మాత్రమే లంచాలు ఇచ్చినట్లుగా సర్వే రిపోర్ట్ చెబుతోంది.

లంచగొండితనం ఎక్కువ.. తక్కువ ఉన్న రాష్ట్రాలు..
లంచం చెల్లించే రాష్ట్రాల్లో రాజస్థాన్, బీహార్, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, జార్ఖండ్, పంజాబ్ రాష్ట్రాలు ముందున్నాయి. ఢిల్లీ, హర్యానా, గుజరాత్, పశ్చిమ బెంగాల్, కేరళ, గోవా, ఒడిశా రాష్ట్రాలలో లంచగొండితనం రేటు తక్కువగా ఉంది.

లంచాలు ఎలా ఇస్తున్నారంటే?
ప్రభుత్వ కార్యాలయాలలోను లంచగొండితనానికి పాల్పడినవి ఎక్కువగా ఉన్నట్లు సర్వే తెలిపింది. ఈ సర్వే ప్రకారం.. క్యాష్, బహుమతులు, ఏజెంట్స్ ద్వారా ఇచ్చిన లంచాలు దాదాపు 35 శాతం ఉన్నాయి. 6 శాతం ఫేవర్స్ (నీకిది-నాకది) రూపంలో చెల్లించారు. మరో 37 శాతం మంది తాము పనులు చేసుకునేందుకు లంచం చెల్లించలేదని తెలిపారు.
More From GoodReturns

నేస్తం నేనున్నా.. భారత్కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications