2022 నాటికి కరోనా వైరస్ పూర్తిగా అంతం: బిల్ గేట్స్
2021 సంవత్సరం నాటికి ఎక్కువ దేశాల్లో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుతుందని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా వ్యాక్సీన్ త్వరలో అందుబాటులోకి వస్తుందన్నారు. వ్యాక్సీన్ అందుబాటులోకి రావడంతో 2022 నాటికి కరోనా ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పూర్తిగా తగ్గిపోతుందన్నారు. కరోనా వల్ల కలిగిన ఆర్థిక నష్టం తిరిగి పుంజుకోవడం కష్టమేనని చెప్పారు.
గుడ్న్యూస్, అమెరికాలో పెరుగుతున్న ఉద్యోగాలు: ఏ సిటీలో ఎంత నిరుద్యోగ శాతం?
ఈ వైరస్ పోరులో భాగంగా కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ, నూతన చికిత్సా విధానం, వ్యాక్సీన్ తయారీ, పరిశోధనలు వంటి అంశాల్లో కీలక అడుగులు పడుతున్నాయన్నారు. వీటి వల్లనే మనం ధనిక ప్రపంచంలో ఉన్నామనే భావన కలుగుతోందన్నారు. ఈ రిచ్ వరల్డ్ 2021 చివరి నాటికి కరోనాను అంతం చేయగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. 2022 నాటికి మిగిలిన దేశాల నుండి కరోనా వెళ్లిపోతుందన్నారు.
కరోనా వ్యాక్సీన్ పరిశోధనల కోసం గేట్స్ ఫౌండేషన్ పని చేస్తోంది. ఇందుకు పెద్ద ఎత్తున నిధులు సమకూర్చింది. గేట్స్ ఫౌండేషన్ నుండి తమకు 150 మిలియన్ డాలర్లు ఆర్థిక సాయం అందనుందని పుణేకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు గత వారమే ప్రకటించింది. ఈ మేరకు సీరమ్ సంస్థ, గ్లోబల్ అలయెన్స్ ఫర్ వ్యాక్సీన్ అండ్ ఇమ్యునైజేషన్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంతో దాదాపు 100 మిలియన్ డోసుల కరోనా వ్యాక్సీన్లను తయారు చేసి భారత్ సహా 92 దిగువ, మధ్య ఆదాయ దేశాలకు సరఫరా చేయనున్నట్లు సీరమ్ ప్రకటించింది.