For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వంటనూనెలపై కరోనా ఎఫెక్ట్ .. ఇండియాలో పడిపోతున్న వంటనూనె దిగుమతులు... ఎంతగా అంటే !!

|

ఇండియాలో కరోనా ప్రభావంతో పామాయిల్ దిగుమతులు గణనీయంగా తగ్గుతుంది . ఆగస్టులో భారతదేశ పామాయిల్ దిగుమతులు 13.9% తగ్గి 7,34,351 టన్నులకు చేరుకున్నాయని ప్రముఖ వాణిజ్య సంస్థ శుక్రవారం తెలిపింది. హోటళ్ళు మరియు రెస్టారెంట్ల నుండి డిమాండ్ మందగించడం వల్ల ఈ పరిస్థితి నెలకొందని అంటున్నారు. ఇండియాలో కరోనావైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి.

 గత నెలలో 10.4% తగ్గిన సోయా చమురు దిగుమతులు

గత నెలలో 10.4% తగ్గిన సోయా చమురు దిగుమతులు

దేశంలోని సోయా చమురు దిగుమతులు గత నెలలో 10.4% పడిపోయి 3,94,735 టన్నులకు చేరుకోగా, పొద్దుతిరుగుడు చమురు దిగుమతులు 31% తగ్గి 1,58,518 టన్నులకు చేరుకున్నాయని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (SEA) ఒక ప్రకటనలో తెలిపింది. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ అని , వంట నూనెల తక్కువ కొనుగోళ్లు, మలేషియా పామాయిల్ ధరలు మరియు యు.ఎస్. సోయా ఆయిల్ ధరలపై కాస్త ఒత్తిడిని కలిగిస్తాయి.

హోటల్స్ , రెస్టారెంట్స్ లో బాగా తగ్గిన పామాయిల్ వాడకం

హోటల్స్ , రెస్టారెంట్స్ లో బాగా తగ్గిన పామాయిల్ వాడకం

పామాయిల్‌ను ప్రధానంగా హోటళ్ళు మరియు రెస్టారెంట్లు వినియోగిస్తాయి. మార్చిలో దేశవ్యాప్తంగా కరోనావైరస్ లాక్‌డౌన్ విధించిన తరువాత క్రమంగా జూన్ నుండి తిరిగి ప్రారంభమైంది. పామాయిల్ అమ్మకాలు జూలైలో వేగవంతం అయ్యాయి. అయితే ప్రపంచంలో రెండవ అత్యధిక జనాభా కలిగిన దేశంలో కరోనావైరస్ కేసులు పెరగడం వల్ల ఆగస్టులో డిమాండ్ బాగా తగ్గింది. భారతదేశం ఇండోనేషియా మరియు మలేషియా నుండి పామాయిల్ మరియు సోయా ఆయిల్ తో పాటు పొద్దుతిరుగుడు నూనె వంటి ఇతర నూనెలను అర్జెంటీనా, బ్రెజిల్, ఉక్రెయిన్ మరియు రష్యా నుండి కొనుగోలు చేస్తుంది.

 14% తగ్గిన పామాయిల్ దిగుమతులు

14% తగ్గిన పామాయిల్ దిగుమతులు

పామాయిల్ మరియు సోయా ఆయిల్ దిగుమతులు ఆగస్టులో భారతదేశం యొక్క మొత్తం వంట నూనె దిగుమతులను సంవత్సరానికి 14% తగ్గించి 1.37 మిలియన్ టన్నులకు చేరుకున్నాయని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. నవంబర్‌లో ప్రారంభమైన 2019-20 మార్కెటింగ్ సంవత్సరంలో మొదటి 10 నెలల్లో, భారతదేశ వంటనూనెల దిగుమతులు 13% తగ్గి 11.2 మిలియన్ టన్నులకు చేరుకున్నాయని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది.

 ప్రస్తుత చమురు సంవత్సరంలో భారీగా తగ్గిన వంట నూనె దిగుమతులు

ప్రస్తుత చమురు సంవత్సరంలో భారీగా తగ్గిన వంట నూనె దిగుమతులు

భారతదేశం యొక్క మొత్తం వంట నూనె దిగుమతులు ప్రస్తుత చమురు సంవత్సరంలో అక్టోబర్ 2020 వరకు 1.4-1.5 మిలియన్ టన్నుల మేర తగ్గాయని చెప్పారు. ఈ సంవత్సరంలో 13.4-13.5 మిలియన్ టన్నులకు పడిపోవచ్చని అంచనా. అంతకుముందు సంవత్సరం మొత్తం 14.9 మిలియన్ టన్నుల కొనుగోళ్లతో పోలిస్తే ఇది తగ్గిందని SEA ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.వి. మెహతా చెప్పారు. శుద్ధి చేసిన పామాయిల్ మరియు పామోలిన్ దిగుమతులపై భారత్ జనవరిలో ఆంక్షలు విధించింది . పొరుగు దేశాలైన నేపాల్ మరియు బంగ్లాదేశ్ నుండి శుద్ధి చేసిన పామాయిల్ దిగుమతి చేసుకోవడానికి 39 లైసెన్సులను నిలిపివేసింది.

English summary

వంటనూనెలపై కరోనా ఎఫెక్ట్ .. ఇండియాలో పడిపోతున్న వంటనూనె దిగుమతులు... ఎంతగా అంటే !! | Corona effect on edible oils .. Falling edible oil imports in India !!

India’s palm oil imports in August dropped 13.9% from a year earlier to 7,34,351 tonnes, a leading trade body said on Friday, due to a sluggish recovery in demand from hotels and restaurants as local coronavirus cases continued to rise.The country’s soy oil imports dropped 10.4% year-on-year to 3,94,735 tonnes last month, while sunflower oil imports fell 31% to 1,58,518 tonnes, the Solvent Extractors’ Association of India (SEA) said in a statement.
Story first published: Friday, September 11, 2020, 18:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X