కరోనా వైరస్ కారణంగా అన్ని రంగాలు మందగించాయి. అయితే ఇటీవల కార్యకలాపాలు క్రమంగా పుంజుకుంటున్నాయి. ఫెస్టివెల్-20 కన్స్యూమర్ సెంటిమెంట్ స్టడీస్ సర్వేలో భాగంగా 100 మిలియన్లకు పైగా సభ్యులు కలిగిన బహుళ బ్రాండ్ లాయాల్టీ ప్రోగ్రామ్ పేబ్యాక్ డిజిటల్ సర్వే భాగస్వామి యునోమర్తో కలిసి మొదటి సర్వేను నిర్వహించింది. ట్రావెల్ లాయలిస్ట్ పైన చేసిన సర్వే ఆధారంగా పునరుజ్జీవం క్రమంగా కనిపిస్తోంది. సెప్టెంబర్ నుండి రికవరీ కనిపిస్తోంది. విమాన రాకపోకలు పెరగడంతో ఆశాజనకంగా కనిపిస్తోంది. పండుగ నేపథ్యంలో ఇప్పటికే ఆన్లైన్, ఆఫ్లైన్ అమ్మకాల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తరుచు ట్రావెల్ చేసే వారిపై సర్వే నిర్వహించారు.

విహార యాత్రలకు ప్లాన్.. ఖర్చులు మాత్రం డౌన్
రాబోయే వారాల్లో 20 శాతం కంటే ఎక్కువమంది విహార యాత్రలను ప్లాన్ చేస్తున్నారని ఈ సర్వేలో వెల్లడైంది. దక్షిణ, ఉత్తర భారత దేశాల్లో ఇది ఆశాజనకంగా ఉంది. అయితే వేగవంతమైన రికవరీ కనిపించడం లేదు. విహార యాత్రకు ప్లాన్ చేస్తున్నప్పటికీ గత ఏడాది కంటే తక్కువగా ఖర్చులు చేస్తామని 40 శాతం మంది వెల్లడించారు. అంతేకాకుండా సుదూర ప్రయాణాలు, అంతర్జాతీయ ప్రయాణాలపై ప్రస్తుతానికి ఆసక్తి సన్నగిల్లింది. అన్-లాక్ నుండి డొమెస్టిక్ ట్రావెల్ క్రమంగా పెరుగుతోంది. తాము వీకెండ్ బ్రేక్ తీసుకున్నామని లేదా సొంత ఊళ్ళకు ప్రయాణిస్తున్నామని దాదాపు 40 శాతం మంది తెలిపారు.

సర్వేలో పాల్గొన్నవారు ఏం చెప్పారంటే
పండుగ సీజన్, పోస్ట్ కోవిడ్ ప్రయాణానికి సంబంధించి దాదాపు వెయ్యి మంది మనోభావాలు, ప్రాధాన్యతలు, దృక్పథంపై సర్వే నిర్వహించింది. గత రెండేళ్ళుగా ప్రయాణిస్తున్న వారు, అన్ని మెట్రో నగరాలు సహా 12 పట్టణాల్లో 25-50 ఏళ్ల మధ్య వయస్సు వారు సర్వేలో పాల్గొన్నారు. కొన్ని టైర్ 1 నగరాలను కూడా ఎంచుకున్నారు. ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 40 శాతం మంది తమ గ్రామాలకు ట్రావెల్ చేస్తున్నామని, పండుగ సమయంలో 20 శాతం మంది దక్షిణ, ఉత్తర భారత దేశంలో పర్యటనలకు ప్లాన్ చేస్తున్నట్లు తేలింది. సర్వేలో పాల్గొన్నవారిలో నాలుగో వంతు మంది దేశీయంగా వెకేషన్ ఎంచుకోగా, ఎక్కువగా వారాంతం లేదా సమీప గమ్యస్థానాలను ఎంచుకున్నారు. పురుషులు స్మాల్ వెకేషన్కు ప్రాధాన్యత ఇవ్వగా, మహిళలు లాంగ్ వెకేషన్కు ప్రాధాన్యత ఇచ్చారు.

షార్ట్ హాలీడే వెకేషన్ కోసం సెల్ఫ్ డ్రైవ్ మోడ్
మహిళలు షార్ట్ హాలీడే వెకేషన్ కోసం సెల్ఫ్ డ్రైవ్ మోడ్ని ఎంచుకున్నారు. 40 శాతం కంటే ఎక్కువమంది కస్టమర్లు గత ఏడాదికంటే తక్కువ ఖర్చు చేస్తామని చెప్పారు. 35 శాతం మంది అదే స్థాయిలో ఖర్చు చేస్తామని, 20 శాతం మంది మాత్రమే గతంలో కంటే ఎక్కువ ఖర్చును చేస్తామని తెలిపారు. ఉత్తరాది తర్వాత దక్షిణాది వారు ఖర్చులు చేస్తామన్నారు. సంప్రదాయ ట్రావెల్ ఏజెంట్లకు బదులు ఆన్ లైన్ ప్లాట్ఫాం బుకింగ్ వైపు మూడింట రెండొంతుల మంది మొగ్గు చూపుతున్నారు. 60 శాతం మంది హోటల్స్ను బుక్ చేసుకున్నారు లేదా బుక్ చేసుకోవాలని భావిస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications