Work From Home: అరె పరిస్థితులన్నీ పూర్తిగా సర్థుకున్నాయ్.. పాత పద్ధతిని తిరిగి క్రమంగా తీసుకొచ్చే పనిలో ఉన్నాయి కంపెనీలు. ఇందుకోసం ఉద్యోగులను సిద్ధం చేయాలనే ప్రయత్నంలో భాగంగా హైబ్రిడ్ విధానాన్ని ప్రారంభించాయి. ఆ తర్వాత మెల్లగా ఉద్యోగులను ఆఫీసులకు రప్పించాలని ప్లాన్ చేశాయి. కానీ ఇప్పుడప్పుడే ఇది కుదిరేలా లేదని తెలుస్తోంది.

మళ్లీ కరోనా కేసులు..
కరోనా వైరస్ పుట్టిల్లైన చైనాలో కేసులు రోజురోజుకూ క్రమంగా పెరుగుతున్నాయి. కొత్త రకం వేరియంట్ లక్షల మందిని ఆసుపత్రుల పాలు చేస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో కంపెనీల్లోనే కాక ఉద్యోగుల్లోనూ భయాలు మెుదలయ్యాయి. దీనిలో భాగాంగా కంపెనీలు 2023లోనూ హైబ్రిడ్ విధానాన్ని ఎంచుకోవచ్చని భావిస్తున్నారు.

కంపెనీలు ఏమంటున్నాయి..
ఫ్లిప్కార్ట్, మారికో, టాటా స్టీల్, ఎల్టీఐ మైండ్ ట్రీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ తో పాటు మరిన్ని కంపెనీలు హైబ్రిడ్ విధానాన్ని కొనసాగించేందుకు అనుకూలంగా ఉన్నాయి. మరిన్ని కంపెనీలు ఇదే బాటను ఎంచుకునే అవకాశం ఉంది. దీనివల్ల ఉద్యోగులకు మంది అవకాశం లభించవచ్చు. పైగా హైబ్రిడ్ మోడల్ వర్క్ అనేది కంపెనీలు, ఉద్యోగుల మధ్య ప్రాధాన్యత ఎంపికగా మారుతోంది. పైగా ఇటు ఉద్యోగాన్ని, అటు కుటుంబాన్ని ఏకకాలంలో బ్యాలెన్స్ చేసేందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ దోహదపడుతుందని చాలా మంది ఉద్యోగులు భావిస్తున్నట్లు పలు సర్వేల్లో వెల్లడైంది.

హైబ్రిడ్ మోడల్..
చాలా ఐటీ సేవల కంపెనీలు తమ ప్రాజెక్టులకు అనుగుణంగా ఉద్యోగులు వారంలో కనీసం మూడు రోజులు ఆఫీసులకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. దీనికి సంబంధించి రోస్టర్ తయారు చేయాలని మేనేజర్లకు సైతం సమాచారం ఇచ్చాయి. దీనివల్ల ఆఫీసుల్లో ఉద్యోగులు ఒకరిని ఒకరు కలవటం మంచి రిలేషన్ షిప్ పెరగటానికి దోహదపడుతోందని కంపెనీలు భావిస్తున్నాయి. ఇది వారి ప్రొడక్టివిటీని కూడా పెంచటానికి సహాయకారిగా నిలుస్తుందని వారు అంటున్నారు.

ఫ్లిప్కార్ట్ ప్లాన్..
కంపెనీ గత కొన్ని నెలలుగా హైబ్రిడ్ మోడల్ను అమలు చేస్తోందని ఫ్లిప్కార్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ వెల్లడించారు. ఇదే సమయంలో LTIMind Tree ప్రస్తుతం 100 శాతం ఉద్యోగులు ఆఫీసులకు రప్పిస్తున్నప్పటికీ.. ఉద్యోగుల డిమాండ్, అవసరాలకు అనుగుణంగా హైబ్రిడ్ మోడల్ గురించి ఆలోచించవచ్చని కంపెనీ తెలిపింది.
More From GoodReturns

Layoffs: కోడింగ్ చేసే రోజులు పోయాయా? లేఆఫ్స్ భయాల మధ్య TCS సీఈఓ కీలక వ్యాఖ్యలు!

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!



Click it and Unblock the Notifications