ప్రముఖ ప్రైవేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్.. తన బ్యాంకింగ్ లావాదేవీలను విస్తరించే పనిలో ఉంది. మరో ప్రైవేట్ బ్యాంకు సిటీ గ్రూప్ రిటైల్ బిజినెస్ కొనుగోలు చేసే పనిలో ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. రెండు, మూడురోజుల్లో డీల్ కంప్లీట్ కానుంది. ఈ ఒప్పందం విలువ 2.5 బిలియన్ డాలర్లు (రూ.18,750 కోట్లు)గా ఉండనుంది. అంటే చర్చలు జరుగుతున్నాయి.. విలువ పెరగొచ్చే.. తగ్గే అవకాశం ఉంది.
ఒప్పందానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ అప్రూవల్స్ వచ్చాక డిటైల్స్ను యాక్సిస్ బ్యాంక్ ప్రకటించనుంది. అగ్రిమెంట్ ప్రకారం 2 బిలియన్ డాలర్లను క్యాష్గా యాక్సిస్ బ్యాంక్ చెల్లించనుంది. సిటీ గ్రూప్ రిటైల్ బిజినెస్ కోసం టాప్ బ్యాంకులు పోటీ పడగా, యాక్సిస్ బ్యాంక్ డీల్ను కుదుర్చుకోగలిగింది. దేశంలో సిటీ గ్రూప్ ఉద్యోగులకు జాబ్ సెక్యూరిటీని ఆఫర్ చేయడం వంటి అంశాలలో మిగిలిన బ్యాంకులతో పోలిస్తే యాక్సిస్ బ్యాంక్ ముందుందని అన్నారు.

డీల్ పూర్తయ్యాక యాక్సిస్ బ్యాంక్లో సిటీ గ్రూప్ రిటైల్ బిజినెస్ను మెర్జ్ చేయడానికి కనీసం ఆరు నెలల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. డీల్ చివరి దశలో ఉన్నప్పటికీ, అగ్రిమెంట్ క్యాన్సిల్ అయ్యే సందర్భాలు కూడా ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్, సిటీ గ్రూప్ ప్రతినిధులు ఈ అంశంపై కామెంట్ చేయడానికి నిరాకరించారు. మొత్తం 13 దేశాల్లో రిటైల్ బిజినెస్ను అమ్మేస్తామని సిటీ గ్రూప్ గతేడాది ప్రకటించిన విషయం తెలిసిందే. సిటీ గ్రూప్ వెల్త్ మేనేజ్మెంట్ వంటి బిజినెస్ కొనసాగిస్తుంది. కేవలం రిటైల్ బిజినెస్లను మాత్రమే విక్రయిస్తోంది. దానికి సంబంధించి యాక్సిస్ బ్యాంకు ముందుకు వచ్చి చర్చలు జరుపుతుంది.
సిటీ బ్యాంకు తీసుకోవడానికి మిగతా బ్యాంకులు కూడా ముందుకు వచ్చాయి. అయితే ఒప్పందం విలువ, ఉద్యోగుల భద్రతకు సంబంధించి చర్చలు ఆశాజనకంగా జరగలేదు. దీంతో అర్ధాంతరంగా డిస్కషన్స్ ముగిశాయి. కానీ యాక్సిస్ బ్యాంక్ మాత్రం ఉద్యోగులకు తగిన భద్రత కల్పిస్తామని... జాబ్ నుంచి తీసివేయమని స్పష్టత ఇచ్చినట్టు తెలుస్తోంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications