భారత్ సహా పలు దేశాల్లో గోధుమ ప్రధాన పంట. అధిక శాతం ప్రజలు గోధుమ ఉత్పత్తులను ఆహారంగా తీసుకుంటారు. గతంలో రష్యా, ఉక్రెయిన్ లు అతిపెద్ద ఎగుమతిదారులుగా ఉండేవి. ఆ రెండూ యుద్ధం చేస్తుండటంతో.. అంతర్జాతీయ ఆహార గొలుసులో భారీ సంక్షోభం తలెత్తింది. ఒకానొక సమయంలో ఇండియా నుంచి గోధుమ ఎగుమతులపై నిషేధం సైతం విధించాం. అయితే ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న గోధుమ ఉత్పత్తుల ధరలను అదుపుచేయడానికి ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది.

30 కాదు మొత్తం 50:
గోధుమలు, అట్టా ధరలను అదుపు చేసేందుకు కేంద్రం తన బఫర్ స్టాక్ నుంచి కొంత మొత్తాన్ని బహిరంగ మార్కెట్ లోకి విడుదల చేయనుంది. మొత్తం 30 లక్షల టన్నులను అందుబాటులోకి తేనున్నట్లు జనవరి 25న ప్రకటించింది. దానికి కొనసాగింపుగా మరో 20 కలిపి మొత్తం 50 లక్షల టన్నులను ఆఫ్ లోడ్ చేయనున్నట్లు ఈరోజు స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర సంక్షేమ పథకాలకు కేటాయించిన మొత్తానికి ఇవి అదనం అని పేర్కొంది.

బల్క్ కొనుగోలుదారులకు..
కేంద్ర ప్రభుత్వం అధీనంలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్ల నుంచి ఈ బఫర్ స్టాక్ విడుదల కానుంది. అయితే దీన్ని ఇ-వేలం ద్వారా పిండి మిల్లులు, ప్రైవేటు వ్యాపారులు, బల్క్ కొనుగోలుదారులు, గోధుమ ఉత్పత్తుల తయారీ సంస్థలకు విక్రయించనున్నారు. మంత్రుల బృందం ప్రతిపాదనల మేరకు ఈ అమ్మకాలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

మార్కెట్ స్థిరీకరణకు..
మొత్తం 50 లక్షల టన్నులను ఓపెన్ మార్కెట్ లో విక్రయించడం ద్వారా దేశీయంగా గోధుమ ధరలు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఆహార ఉత్పత్తుల మార్కెట్ ను స్థిరీకరించేందుకు ఈ చర్యలు సహాయపడతాయని ఆశిస్తోంది. అయితే ఇలా అమ్మకాలు చేపట్టడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఈ తరహా విక్రయాలు జరపగా.. వ్యాపార వర్గాల నుంచి మంచి స్పందన లభించింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications