pmay: వచ్చే ఏడాది దేశంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ దఫా మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ కావడంతో కేంద్రం ఆచితూచి అడుగులు వేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. వ్యక్తిగత ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పులు, PM కిసాన్ పథకం నిధుల పెంపు వంటి ఎన్నో చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. PM ఆవాస్ యోజన కింద పేదల ఇళ్ల కోసం ఈ బడ్జెట్ లో 40 వేల కోట్లను కేటాయించనున్నట్లు తెలుస్తోంది. కానీ గతేడాదితో పోలిస్తే సుమారు 10 వేల కోట్లు తగ్గించనుండటం గమనార్హం.

గతేడాదితో పోలిస్తే..
PMAY పథకానికి 2022 బడ్జెట్లో 48 వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రకటించింది. పట్టణ ప్రాంతాల్లోని ఇళ్లక 28 వేల కోట్లు, మిగిలిన మొత్తాన్ని గ్రామీణ ప్రాంతాల్లోని నిర్మాణాల కోసం వెచ్చించడానికి నిర్ణయించింది. ఫిబ్రవరి 1 న లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో.. ఈసారి 40 వేల కోట్లు ఇస్తున్నట్లు ప్రకటన వెలువడనుందని మీడియా నివేదికలు చెబుతున్నాయి.

ఎలక్షన్స్కు వెళ్లేముందు..
2024 వకు 84 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ నివేదిక వెల్లడించింది. ఇదే చివరి బడ్జెట్ కానుండటం, వచ్చే ఏడాది ఎన్నికలకు వెళ్లాల్సి ఉండటంతో.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని మోడీ ప్రభుత్వం భావిస్తున్నట్లు పేర్కొంది.

ఏమిటి ఈ PMAY ?
తక్కువ, మధ్య తరగతి ఆదాయ వర్గాలకు గృహాల కొరతను పరిష్కరించాలని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే లక్ష్యంతో 2015లో PMAY పథకాన్ని ప్రారంభించింది. హౌసింగ్, పట్టణ వ్యవహారాల శాఖ ఈ గృహాల కేటాయింపులను పర్యవేక్షిస్తుంటుంది. స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తవుతున్నందును 2022 మార్చి నాటికి అర్హులైన వారికి పక్కా గృహాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దానిని ఇప్పుడు డిసెంబరు 31, 2024 వరకు పొడిగించారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications