ఇప్పటికే వివిధ బ్యాంకులను విలీనం చేసిన కేంద్ర ప్రభుత్వం అవసరమైతే మరిన్ని ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. అవసరాలకు అనుగుణంగా మరిన్ని బ్యాంకులను విలీనం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమన్నారు. దేశ ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకొని గత ఏడాది ప్రభుత్వం పది బ్యాంకులను విలీనం చేసి 4 పెద్ద బ్యాంకులుగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

అవసరమనుకుంటే మరిన్ని బ్యాంకుల విలీనం
2017లో భారత్లో 27 ప్రభుత్వరంగ బ్యాంకులు ఉండగా, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అవి 12కు తగ్గనున్నాయి. విజయవంతంగా బ్యాంకుల విలీనం పూర్తయిందని, మూలధన పునర్వ్యవస్థీకరణలను చేశామని అనురాగ్ ఠాకూర్ చెప్పారు. దివాలా స్మృతితో బ్యాంకులకు రూ.4 లక్షల కోట్లు తిరిగి వచ్చాయన్నారు. భవిష్యత్తులో అవసరమనుకుంటే మరిన్ని బ్యాంకుల విలీనం ఉంటుందని తెలిపారు.

పెద్ద బ్యాంకులు ఉంటేనే మంచిది
ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షల మేరకు 2024-24 నాటికి భారత్ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి అంతర్జాతీయస్థాయి బ్యాంకులు ఏర్పాటు అవసరం ఎంతైనా ఉందన్నారు. వచ్చే ఏప్రిల్ 1వ తేదీ నుంచి 6 అంతర్జాతీయస్థాయి బ్యాంకులు మన దేశంలో ఉన్నట్లవుతుందని చెప్పారు. పెద్ద బ్యాంకులు ఉంటేనే ఖాతాదారులకు మంచి సేవలు అందించగలమని చెప్పారు. బలమైన రుణ వితరణ సామర్థ్యం కలిగి ఉంటాయన్నారు.

ఆర్థిక సేవలు, మెరుగైన పథకాలు
పెద్ద బ్యాంకులతో పెద్ద సంఖ్యలో ప్రజలకు ఆర్థిక సేవలు, మెరుగైన పథకాలు అందించేందుకు వీలవుతుందని ఠాకూర్ పేర్కొన్నారు. 2017 ఏప్రిల్ నెలలో అయిదు అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకును SBIలో విలీనం చేశారు. అనంతరం 2019లో విజయా బ్యాంకు, దేనా బ్యాంకులను బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ)లో విలీనం చేశారు. మరిన్ని బ్యాంకులను కూడా విలీనం చేశారు. దీంతో బ్యాంకుల సంఖ్య 12కు తగ్గింది.

రూ.90,000 కోట్ల దాకా సమీకరించాలని..
LIC లిస్టింగ్ చేయడం ద్వారా సంస్థలో మరింత పారదర్శకత పెరుగుతుందని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఎల్ఐసీలో కొన్ని వాటాలతో పాటు ఐడీబీఐ బ్యాంకులో వాటాల విక్రయం ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరం రూ.90,000 కోట్ల దాకా సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకుంది. ఎల్ఐసీలో ప్రభుత్వానికి ప్రస్తుతం 100%, ఐడీబీఐలో 46.5% వాటాలున్నాయి. రుణ పునర్వ్యవస్థీకరణ వెసులుబాటుతో పాటు గత ఏడాది దాదాపు అయిదు లక్షల లఘు, చిన్న, మధ్యతరహా సంస్థలకు ప్రయోజనం చేకూరిందని ఠాకూర్ తెలిపారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications