న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం- తన పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను మరింత ముమ్మరం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మరిన్ని ప్రభుత్వరంగ కంపెనీల్లో తన వాటాలను విక్రయించనుంది. వాటిని ప్రైవేటీకరించనుంది. ఈ సంవత్సరం ప్రైవేటీకరణ ప్రక్రియ ద్వారా కనీసం 70,000 కోట్ల రూపాయలను సమీకరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం.
గత ఆర్థిక సంవత్సరంలో ఎయిరిండియా, జీవిత బీమా సంస్థల్లో తన పెట్టుబడులను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో పవన్ హన్స్ లిమిటెడ్ నుంచి తన వాటాలను విక్రయించుకోవడానికి ఏర్పాట్లను పూర్తి చేసుకుంది. ఇదివరకే స్టార్9 మొబిలిటీ బిడ్డింగ్కు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపం) ఆమోదం తెలిపినప్పటికీ.. దీన్ని తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు వార్తలు వస్తోన్నాయి.

జూన్లో మళ్లీ దీనికి సంబంధించిన ప్రక్రియను కొనసాగించే అవకాశం ఉంది. దీనితోపాటు ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఐటీసీ, హిందుస్తాన్ జింక్ కంపెనీల్లో పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన సన్నాహకాలను త్వరలో మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అంటే అక్టోబర్-నవంబర్-డిసెంబర్లో ఈ రెండింటినీ ప్రైవేటీకరించాలని భవిష్యత్ ప్రణాళికలను రూపొందించుకున్నట్లు చెబుతున్నారు.
హిందుస్తాన్ జింక్ లిమిటెడ్లో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న వాటా 29.54 శాతం. దీని విలువ సుమారు 37,000 కోట్ల రూపాయలు. ఐటీసీలో ఉన్న పెట్టుబడుల శాతం 7.91. యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ద్వారా ఐటీసీలో పెట్టుబడులను పెట్టింది. ఇప్పుడీ రెండింట్లోనూ వందశాతం మేర తన వాటాలను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ రెండింటినీ ప్రైవేటీకరించడం ద్వారా కనీసం 65,000 నుంచి 70,000 కోట్ల రూపాయలను సమీకరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
కాగా- ఇప్పటికే జీవితబీమా సంస్థలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను చేపట్టిన విషయం తెలిసిందే. పబ్లిక్ ఇష్యూను జారీ చేసింది ఎల్ఐసీ. 21,000 కోట్ల రూపాయలను సేకరించుకోవాలనే లక్ష్యంతో ఎల్ఐసీ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ను జారీ చేసినప్పటికీ.. అది విఫలమైంది. 20,500 కోట్ల రూపాయలే సమకూరాయి. పైగా స్టాక్ మార్కెట్లో లిస్టింగ్లోకి వచ్చిన తరువాత ఎల్ఐసీ ఐపీఓ అట్టర్ ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే. 949 రూపాయలుగా ఉన్న ఎల్ఐసీ షేర్ ధర.. ఇవ్వాళ రూ.814.80 పైసల వద్ద ట్రేడింగ్ అయింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications