adani: అమెరికా సంస్థ హిండెన్ బర్గ్ నివేదిక వల్ల అదానీ గ్రూపులో చెలరేగిన విధ్వంసం అందరికీ తెలిసిందే. లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల పెట్టుబడులు గంగలో కలిసిపోయాయి. ఈ విషయంపై కేంద్రం మంత్రులు ఎవరూ నెగటివ్ గా స్పందించిన దాఖలాలు లేవు. అయితే ఇండియా టుడే కాన్ క్లేవ్ 2023లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. అదానీ సంక్షోభం, BBC డాక్యుమెంటరీ, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం వంటి పలు అంశాలపై ఆయన శుక్రవారం మాట్లాడారు.

కోర్టులపై నమ్మకం ఉంచండి:
అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలన్న ప్రతిపక్షాల డిమాండ్ గురించిన ఓ ప్రశ్నకు అమిత్ షా సమాధానమిచ్చారు. ఈ విషయంపై తమ ప్రభుత్వానికి ఎటువంటి గందరగోళం లేదని స్పష్టం చేశారు. అదానీ సంస్థల గురించి దర్యాప్తు చేసేందుకు సుప్రీం కోర్టు ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. న్యాయస్థానమే ఈ వ్యవహారాన్ని తేలుస్తుందని, కోర్టులపై ప్రజలు విశ్వాసముంచాలన్నారు.

సెబీ, సుప్రీం దర్యాప్తు చేస్తున్నాయ్..
అదానీ గ్రూపు కంపెనీల్లో ఏవైనా అక్రమాలు జరిగినట్లు ఎవరిదగ్గరైనా రుజువులు ఉంటే సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ముందు వాటిని సమర్పించ వచ్చని కేంద్ర హోం మంత్రి తెలిపారు. తప్పు జరిగినట్లు నిర్ధారణైతే ఎవరినీ విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. అయితే కమిటీ నివేదిక సైతం తప్పు అని భావిస్తే అప్పుడు ఆరోపణలు చేయవచ్చంటూ ప్రతిపక్షాలకు చురకలు అంటించారు. దీనిపై సెబీ దర్యాప్తు జరుపుతున్నట్లు ఉన్నత న్యాయస్థానానికి ఇప్పటికే నివేదించిందని గుర్తుచేశారు.

BBC డాక్యుమెంటరీ:
ప్రధాని మోడీకి వ్యతిరేకంగా BBC ప్రసారం చేసిన డాక్యుమెంటరీపై అమిత్ షా స్పందించారు. 2002 నాటి సంఘటనలపై 2023లో డాక్యుమెంటరీ విడుదల చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. మరో ఏడాదిలో జాతీయ స్థాయి ఎన్నికలకు వెళ్లనుండగా.. ఇప్పుడు ఈ వీడియో బయటకు రావడం పలు అనుమానాలు రేకెత్తిస్తోందన్నారు. అందుకే దాని ప్రసారంపై భారత్ లో నిషేధం విధించినట్లు చెప్పారు.

కేంద్ర సంస్థల దుర్వినియోగం:
ఎటువంటి కేంద్ర ఏజెన్సీలూ చట్టానికి అతీతం కాదని షా స్పష్టం చేశారు. CBI, EDలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్న ఆరోపణలపై ఆయన సమాధానమిచ్చారు. అవినీతి కేసుల్లో కేంద్ర సంస్థలు చర్యలు తీసుకోవడంలో తప్పు ఏముందన్నారు. ఏది ఏమైనా 2024లోనూ పూర్తి మెజారిటీతో మరోసారి BJP ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి ప్రధాని కావడం తథ్యమన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications