న్యూఢిల్లీ: ఆధార్ కార్డ్.. ప్రతి చోటా దీని అవసరం ఏర్పడింది. ఆర్థిక లావాదేవీలకు మాత్రమే కాదు.. రోజువారీ చర్యల్లోనూ ఈ ఆధార్డ్ కార్డ్ తప్పనిసరిగా మారింది. ఆధార్ కార్డ్ లేనిదే వ్యాక్సిన్ కూడా వేయించుకోలేని పరిస్థితి ఉంది. ఇక బ్యాంకింగ్ సెక్టార్లో ఈ కార్డ్ లేనిదే ఏ పనీ చేయలేం. ఇదే లైన్లో పాన్ కార్డ్ కూడా చేరింది. ఆర్థిక లావాదేవీల విషయంలో పర్మినెంట్ అకౌంట్ నంబర్ (పాన్) కార్డ్ తప్పనిసరిగా మారింది.
డీ మ్యాట్ సహా బ్యాంక్లో అకౌంట్ ఉన్న ఖాతాదారులు ఆధార్-పాన్ కార్డుల లింక్ను కలిగి ఉండాలంటూ రిజర్వుబ్యాంక్ చాలాకాలం కిందటే ఆదేశాలను జారీ చేసింది. దీని మీద కొంత వ్యతిరేకత ఏర్పడటంతో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ గడువును పొడిగించుకుంటూ వస్తోంది. ఖాతాదారులకు కొంత వెసలుబాటు కల్పించింది. కొత్తగా ఈ గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. ఖాతాదారులకు శుభవార్త ఇచ్చింది.

ఇదివరకు ఆధార్ కార్డుతో పాన్తో అనుసంధానం చేయడానికి ఈ నెల చివరి వరకు గడువు ఉండేది. దీన్ని మరో ఆరు నెలల వరకు పొడిగించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు అంటే వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు ఆధార్ కార్డ్-పాన్ కార్డ్ లింకేజీ గడువును పొడిగించింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) ఓ ప్రకటన జారీ చేసింది. ఈ పొడిగింపు ప్రకారం.. బ్యాంకుల్లో కొత్తగా ఖాతాలను తెరవ దలిచిన వారు ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్..జిరాక్స్ ప్రతులను అందించితే సరిపోతుంది.
వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు ఆధార్-పాన్ కార్డ్ లింకింగ్ వ్యవస్థను సీబీడీటీ పొడిగించినందున అప్పటిదాకా ఈ రెండింటి అనుసంధానం గురించి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులు, ఖాతాదారులు ఎదురుకొంటోన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీబీడీటీ తెలిపింది.
ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో భాగంగా పెనాల్టీ ప్రొసీడింగ్స్ పూర్తి చేయడానికి నిర్దేశించిన గడువును కూడా ఈ నెల 30వ తేదీ నుంచి వచ్చే ఏడాది మార్చి చివరి వరకు పొడిగించినట్లు పేర్కొంది. పాన్కార్డులు చాలా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వాటిల్లో చాలా కీలకంగా మారిన నేపథ్యంలో దాన్ని ఆధార్తో లింక్ చేయాలని రిజర్వు బ్యాంక్ ఇదివరకే ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. ఖాతాదారుల నుంచి ఎదురవుతోన్న వ్యతిరేకత నేపథ్యంలో గడువును పొడిగింస్తూ వస్తోంది సీబీడీటీ.
బ్యాంకుల్లో అకౌంట్లను తెరవడానికి, డీ మ్యాట్ ఓపెన్ చేయడానికీ పాన్ కార్డు అత్యవసరం. 50,000 రూపాయలకు మించిన నగదు లావాదేవీల సమయంలోనూ పాన్ కార్డు తప్పనిసరి. ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి కూడా ఆధార్-పాన్ కార్డుల అనుసంధానం తప్పనిసరి.
More From GoodReturns

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు



Click it and Unblock the Notifications