న్యూఢిల్లీ: ఆధార్ కార్డ్.. ప్రతి చోటా దీని అవసరం ఏర్పడింది. ఆర్థిక లావాదేవీలకు మాత్రమే కాదు.. రోజువారీ చర్యల్లోనూ ఈ ఆధార్డ్ కార్డ్ తప్పనిసరిగా మారింది. ఆధార్ కార్డ్ లేనిదే వ్యాక్సిన్ కూడా వేయించుకోలేని పరిస్థితి ఉంది. ఇక బ్యాంకింగ్ సెక్టార్లో ఈ కార్డ్ లేనిదే ఏ పనీ చేయలేం. ఇదే లైన్లో పాన్ కార్డ్ కూడా చేరింది. ఆర్థిక లావాదేవీల విషయంలో పర్మినెంట్ అకౌంట్ నంబర్ (పాన్) కార్డ్ తప్పనిసరిగా మారింది.
డీ మ్యాట్ సహా బ్యాంక్లో అకౌంట్ ఉన్న ఖాతాదారులు ఆధార్-పాన్ కార్డుల లింక్ను కలిగి ఉండాలంటూ రిజర్వుబ్యాంక్ చాలాకాలం కిందటే ఆదేశాలను జారీ చేసింది. దీని మీద కొంత వ్యతిరేకత ఏర్పడటంతో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ గడువును పొడిగించుకుంటూ వస్తోంది. ఖాతాదారులకు కొంత వెసలుబాటు కల్పించింది. కొత్తగా ఈ గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. ఖాతాదారులకు శుభవార్త ఇచ్చింది.

ఇదివరకు ఆధార్ కార్డుతో పాన్తో అనుసంధానం చేయడానికి ఈ నెల చివరి వరకు గడువు ఉండేది. దీన్ని మరో ఆరు నెలల వరకు పొడిగించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు అంటే వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు ఆధార్ కార్డ్-పాన్ కార్డ్ లింకేజీ గడువును పొడిగించింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) ఓ ప్రకటన జారీ చేసింది. ఈ పొడిగింపు ప్రకారం.. బ్యాంకుల్లో కొత్తగా ఖాతాలను తెరవ దలిచిన వారు ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్..జిరాక్స్ ప్రతులను అందించితే సరిపోతుంది.
వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు ఆధార్-పాన్ కార్డ్ లింకింగ్ వ్యవస్థను సీబీడీటీ పొడిగించినందున అప్పటిదాకా ఈ రెండింటి అనుసంధానం గురించి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులు, ఖాతాదారులు ఎదురుకొంటోన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీబీడీటీ తెలిపింది.
ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో భాగంగా పెనాల్టీ ప్రొసీడింగ్స్ పూర్తి చేయడానికి నిర్దేశించిన గడువును కూడా ఈ నెల 30వ తేదీ నుంచి వచ్చే ఏడాది మార్చి చివరి వరకు పొడిగించినట్లు పేర్కొంది. పాన్కార్డులు చాలా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వాటిల్లో చాలా కీలకంగా మారిన నేపథ్యంలో దాన్ని ఆధార్తో లింక్ చేయాలని రిజర్వు బ్యాంక్ ఇదివరకే ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. ఖాతాదారుల నుంచి ఎదురవుతోన్న వ్యతిరేకత నేపథ్యంలో గడువును పొడిగింస్తూ వస్తోంది సీబీడీటీ.
బ్యాంకుల్లో అకౌంట్లను తెరవడానికి, డీ మ్యాట్ ఓపెన్ చేయడానికీ పాన్ కార్డు అత్యవసరం. 50,000 రూపాయలకు మించిన నగదు లావాదేవీల సమయంలోనూ పాన్ కార్డు తప్పనిసరి. ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి కూడా ఆధార్-పాన్ కార్డుల అనుసంధానం తప్పనిసరి.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications