న్యూఢిల్లీ: ఆధార్ కార్డ్.. ప్రతి చోటా దీని అవసరం ఏర్పడింది. ఆర్థిక లావాదేవీలకు మాత్రమే కాదు.. రోజువారీ చర్యల్లోనూ ఈ ఆధార్డ్ కార్డ్ తప్పనిసరిగా మారింది. ఆధార్ కార్డ్ లేనిదే వ్యాక్సిన్ కూడా వేయించుకోలేని పరిస్థితి ఉంది. ఇక బ్యాంకింగ్ సెక్టార్లో ఈ కార్డ్ లేనిదే ఏ పనీ చేయలేం. ఇదే లైన్లో పాన్ కార్డ్ కూడా చేరింది. ఆర్థిక లావాదేవీల విషయంలో పర్మినెంట్ అకౌంట్ నంబర్ (పాన్) కార్డ్ తప్పనిసరిగా మారింది.
డీ మ్యాట్ సహా బ్యాంక్లో అకౌంట్ ఉన్న ఖాతాదారులు ఆధార్-పాన్ కార్డుల లింక్ను కలిగి ఉండాలంటూ రిజర్వుబ్యాంక్ చాలాకాలం కిందటే ఆదేశాలను జారీ చేసింది. దీని మీద కొంత వ్యతిరేకత ఏర్పడటంతో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ గడువును పొడిగించుకుంటూ వస్తోంది. ఖాతాదారులకు కొంత వెసలుబాటు కల్పించింది. కొత్తగా ఈ గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. ఖాతాదారులకు శుభవార్త ఇచ్చింది.

ఇదివరకు ఆధార్ కార్డుతో పాన్తో అనుసంధానం చేయడానికి ఈ నెల చివరి వరకు గడువు ఉండేది. దీన్ని మరో ఆరు నెలల వరకు పొడిగించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు అంటే వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు ఆధార్ కార్డ్-పాన్ కార్డ్ లింకేజీ గడువును పొడిగించింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) ఓ ప్రకటన జారీ చేసింది. ఈ పొడిగింపు ప్రకారం.. బ్యాంకుల్లో కొత్తగా ఖాతాలను తెరవ దలిచిన వారు ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్..జిరాక్స్ ప్రతులను అందించితే సరిపోతుంది.
వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు ఆధార్-పాన్ కార్డ్ లింకింగ్ వ్యవస్థను సీబీడీటీ పొడిగించినందున అప్పటిదాకా ఈ రెండింటి అనుసంధానం గురించి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులు, ఖాతాదారులు ఎదురుకొంటోన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీబీడీటీ తెలిపింది.
ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో భాగంగా పెనాల్టీ ప్రొసీడింగ్స్ పూర్తి చేయడానికి నిర్దేశించిన గడువును కూడా ఈ నెల 30వ తేదీ నుంచి వచ్చే ఏడాది మార్చి చివరి వరకు పొడిగించినట్లు పేర్కొంది. పాన్కార్డులు చాలా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వాటిల్లో చాలా కీలకంగా మారిన నేపథ్యంలో దాన్ని ఆధార్తో లింక్ చేయాలని రిజర్వు బ్యాంక్ ఇదివరకే ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. ఖాతాదారుల నుంచి ఎదురవుతోన్న వ్యతిరేకత నేపథ్యంలో గడువును పొడిగింస్తూ వస్తోంది సీబీడీటీ.
బ్యాంకుల్లో అకౌంట్లను తెరవడానికి, డీ మ్యాట్ ఓపెన్ చేయడానికీ పాన్ కార్డు అత్యవసరం. 50,000 రూపాయలకు మించిన నగదు లావాదేవీల సమయంలోనూ పాన్ కార్డు తప్పనిసరి. ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి కూడా ఆధార్-పాన్ కార్డుల అనుసంధానం తప్పనిసరి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications