న్యూఢిల్లీ: అధిక వేతనం పొందే ఉద్యోగులు ప్రావిడెంట్ ఫండ్(PF) ఖాతాల్లో జమ చేసే మొత్తంపై ఆర్జించే వడ్డీకి బడ్జెట్లో కొత్త నిబంధనలు ప్రతిపాదించారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను సోమవారం బడ్జెట్ను ప్రవేశపెట్టారు. పీఎఫ్ కొత్త నిబంధన ప్రకారం రూ.2,50,000 వరకు జమ చేసే మొత్తంపై వచ్చే వడ్డీకే పన్ను మినహాయింపు ఉంటుంది. ఈ మొత్తం దాటితే జమ చేసే మొత్తానికి లభించే వడ్డీకి వర్తించే స్లాబ్స్ ప్రకారం పన్నును విధిస్తారు. ఈ కొత్త ప్రతిపాదన ఏప్రిల్ 1, 2021 నుండి జమ చేసే వాటికి వర్తిస్తుంది.
బడ్జెట్కు సంబంధించిన మరిన్ని కథనాలు.. చదవండి

పీఎఫ్.. వడ్డీ, పన్ను రాయితీ
అధిక వేతనాలు తీసుకునే ఉన్నత ఉద్యోగుల ఆదాయాలపై పన్ను మినహాయింపును హేతుబద్దీకరణ చేస్తున్నట్లు బడ్జెట్లో భాగంగా కేంద్రం తెలిపింది. EPF చట్టం ప్రకారం నిర్బంధ చందా కింద వేతనంలో (మూలవేతనం, డీఏ)లో 12 శాతం ఉద్యోగి తన వాటాగా ఈపీఎఫ్లో జమ చేయాలి. కంపెనీగా కూడా అంతేమొత్తం (12 శాతం) తన వాటాగా జమ చేస్తుంది. ఈ పరిమితికి మించి భవిష్యత్తు అవసరాల కోసం వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ కింద ఉద్యోగి మూల వేతనానికి మించకుండా జమ చేసుకునే వెసులుబాటు ఉంది. దీనికి కూడా వడ్డీ, పన్నురాయితీ ఉంటుంది.

అందుకే
ఇతర కొన్ని సురక్షిత పెట్టుబడుల కంటే ఇక్కడ వడ్డీ రావడం, పన్ను రాయితీ ఉండటంతో చాలామంది వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్కు మొగ్గు చూపుతున్నారు. ఎక్కువ వేతనం వచ్చే చాలామంది ఇలాగే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధిక వేతనం పొందే ఉద్యోగులు ప్రావిడెంట్ ఫండ్(PF) ఖాతాల్లో జమ చేసే మొత్తంపై ఆర్జించే వడ్డీకి బడ్జెట్లో కొత్త నిబంధనలు ప్రతిపాదించారు. రూ.2.5 లక్షల మొత్తంపై వడ్డీకి పన్ను మినహాయింపు ఉంటుంది. ఈ మొత్తం దాటితే పన్ను బాదుడు ఉండనుంది.

ఇదీ లెక్క
ఉద్యోగులు ఎవరైనా వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్తో కలిపి పీఎఫ్లో రూ.3 లక్షలు జమ చేస్తుంటే కనుక ఇప్పటి వరకు ఎలాంటి పన్ను లేదు. తాజా బడ్జెట్ ప్రకటన ప్రకారం ఏప్రిల్ 1వ తేదీ నుండి రూ.2.5 లక్షలు మినహాయించి, మిగతా మొత్తానికి అంటే రూ.50వేల మీద వచ్చే వడ్డీ మీద పన్ను చెల్లించాలి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications