న్యూఢిల్లీ: ఇన్సురెన్స్ రంగంలో FDIలు 49 శాతం నుండి 74 శాతానికి పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రకటించారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా 1938 బీమా చట్టాన్ని సవరిస్తున్నట్లు తెలిపారు. డిపాజిట్ల పైన బీమాను పెంచుతున్నట్లు తెలిపారు.
ఇన్సూరెన్స్ యాక్ట్ 1938కు సవరణ చేయాల్సిందిగా ప్రతిపాదిస్తున్నానని, తద్వారా బీమా కంపెనీల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(FDI) పరిమితిని 49 శాతం నుంచి 74 శాతానికి పెంచేందుకు మార్గం సుగమమవుతుందని, నిబంధనలను అనుసరించి విదేశీ యాజమాన్య పెట్టుబడులు పెట్టేందుకు అనుమతులు లభిస్తాయని నిర్మలమ్మ బడ్జెట్ ప్రకటన సమయంలో తెలిపారు.

అలాగే, ప్రభుత్వరంగ సంస్థల్లో భారీగా పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం నిర్ణయించింది. ఎయిరిండియా, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణకు బడ్జెట్లో పచ్చజెండా ఊపారు. పవన్ హన్స్, ఎయిరిండియా ప్రయివేటీకరణకు అనుమతిచ్చింది. IDBI, భారత్ ఎర్త్ మూవర్స్ పెట్టుబడులలో ఉపసంహరణ ఉంటుందని తెలిపారు. LIC పబ్లిక్ ఇష్యూకు వెళ్లే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications