న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ను ప్రవేశ పెడుతున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో స్వతంత్ర భారతంలోనే నిర్మలమ్మ అతి పెద్ద సవాల్తో కూడిన బడ్జెట్ను ప్రవేశ పెడుతున్నట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగుమతులు తగ్గించి, దేశీయంగా తయారీని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఆత్మనిర్భర్ భారత్కు పిలుపునిచ్చింది. ఆత్మనిర్భర్ భారత్ కోణంలో బడ్జెట్ ప్రాధాన్యత ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ ముందు రెండు కీలక సవాళ్లు ఉన్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

మోడీ ప్రభుత్వం ముందు 2 సవాళ్లు
కరోనా కారణంగా ప్రభుత్వం నుండి సామాన్యుడి వరకు ప్రణాళికలో లేని వ్యయం పెరిగింది. అదే సమయంలో ఆదాయం తగ్గింది. రికవరీ వేగంగా ఉండటంతో ఆర్థిక వ్యవస్థ క్షీణత ఊహించిన దానికంటే తక్కువగా ఉన్నప్పటికీ, వృద్ధి కూడా త్వరగా పుంజుకునే అవకాశం ఉన్నప్పటికీ ఒత్తిళ్లు కూడా భారీగానే ఉంటాయని అంటున్నారు. అందుకే ఆర్థిక వ్యవస్థను పునరుద్దరించడం భారత ప్రభుత్వ ప్రధాన అజెండాలో ఉంటుందని అంటున్నారు. మోడీ ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ ముందు కరోనా వైరస్, చైనా రూపంలో రెండు సవాళ్ళు ఉన్నాయని అంటున్నారు.

రక్షణ వ్యయానికి ప్రాధాన్యత
చైనాతో ధీటుగా నిలబడటానికి రక్షణ వ్యయానికి ప్రాధాన్యత ఇవ్వడం అవసరమని చెబుతున్నారు. ఆర్థిక సంకోచంతో పాటు చైనా ఫ్యాక్టర్ అతి కీలకమని అంటున్నారు. ఆదాయం పరంగా చూడలంటే పెట్టుబడుల ఉపసంహరణ కీలకంగా భావిస్తున్నారు. 2021-22 బడ్జెట్లో కరోనా, చైనా సవాళ్లను ఎదుర్కొనే ఆత్మనిర్భర్ భారత్ ఉంటుందని భావిస్తున్నారు.

బడ్జెట్లో ఎక్కువ భాగం ఖర్చులు
ప్రభుత్వ బడ్జెట్లో ఎక్కువ భాగం పెన్షన్లు, వడ్డీ చెల్లింపులు, వేతనాలు, ప్రణాళికాబద్దమైన రాయితీలు తదితరాలు ఉన్నాయి. అయితే ఈసారి గత బడ్జెట్ల కంటే భిన్నంగా కరోనా, చైనాలకు ధీటుగా ఆత్మనిర్భర్ భారత్ దిశగా మరింతగా అడుగులు వేసే బడ్జెట్ అవసరం.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications