7.5% నుంచి 20% పెంపు: ఈ వస్తువుల ధరలు మరింత భారం కానున్నాయి
న్యూఢిల్లీ: బడ్జెట్ ప్రవేశ పెట్టారంటే ఏయే వస్తువుల ధరలు పెరుగుతాయి, ఏయే వస్తువుల ధరలు తగ్గుతాయనే ఉత్కంఠ సహజం. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ఉదయం 11 గంటలకు బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పులు చేశారు. వ్యవసాయ రంగం సహా వివిధ రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారు. బడ్జెట్ నేపథ్యంలో కొన్ని వస్తువుల ధరలు తగ్గనున్నాయి. మరిన్ని పెరుగుతాయి.. అవేమిటంటే...
budget 2020: వేతన భారీ జీవులకు ఊరట, కొత్త ఆదాయపు పన్ను శ్లాబ్స్ ఇవే
కస్టమ్స్ డ్యూటీ పెంపు.
వాల్ ఫ్యాన్స్ పైన కస్టమ్స్ డ్యూటీ పెంచుతున్నట్లు బడ్జెట్ సందర్భంగా నిర్మలా సీతారామన్ తెలిపారు. దీంతో వీటి ధరలు పెరగనున్నాయి. వీటితో పాటు టేబుల్వేర్, కిచెన్వేర్ దిగుమతి సుంకాలు కూడా పెరుగుతున్నాయి. దీంతో వీటి ధరలు కూడా పెరుగుతాయి.
మినహాయింపుల ఉపసంహరణతో ధరల పెరుగుదుల
రాషుగర్, ఆగ్రో అనిమల్ ఆధారిత ఉత్పత్తులు, తునా బెయిట్, స్కిమ్డ్ మిల్క్, కొన్ని అల్కాహాలిక్ బీవరేజెస్, సోయా ఫైబ్, సోయా ప్రొటీన్ ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపును ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. దీంతో వీటి ధరలు కూడా పెరగనున్నాయి.
7.5 శాతం నుంచి 20 శాతానికి
వాల్ ఫ్యాన్స్ పైన కస్టమ్స్ డ్యూటీని 7.5 శాతం నుంచి 20 శాతానికి భారీగా పెంచారు. టేబుల్ వేర్, కిచెన్ వేర్ పైన కూడా అదే స్థాయిలో పెంచారు. పింగాణి లేదా చైనా సిరామిక్, క్లే ఐరన్, స్టీల్, రాగితో తయారు చేసిన వాటిపై 20 శాతం పెరుగుతుంది.
ఈ సుంకం రద్దు
ఎలక్ట్రిక్ వెహికిల్స్ను మినహాయించి ఇతర కమర్షియల్ వెహికిల్ పార్ట్స్, ఉత్ప్రేరక కన్వర్టర్లు కస్టమ్స్ డ్యూటీ పెంచుతున్నట్లు ప్రకటించారు. అధిక పనితీరు గల బహుళార్ధక సాధక ప్లాస్టిక్ ఉత్పత్తిలో ఉపయోగించే పీటీఏపై యాంటీ డంపింగ్ సుంకం రద్దు చేశారు.