బడ్జెట్లో నిర్మలమ్మ శుభవార్త: డెబిట్ కార్డులపై MDR రద్దు
ఇటీవల రూపే కార్డులు, యూపీఐపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీలను రద్దు చేసిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ బడ్జెట్లో డెబిట్ కార్డులు ఉన్న వారికి కూడా ఊరటనిచ్చే అవకాశాలు ఉన్నాయి. డెబిట్ కార్డులపై కూడా ఎండీఆర్ ఛార్జీలను తొలగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. నోట్ల రద్దు అనంతరం మోడీ ప్రభుత్వం డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తోన్న విషయం తెలిసిందే.
అతి కీలక బిజినెస్ డీల్: 'ట్రంప్ను ఆహ్వానించేందుకు మోడీ రెడీ
వచ్చే బడ్జెట్లో ఎండీఆర్ రద్దు
మాస్టర్ కార్డ్, వీసా సహా అన్ని డెబిట్ కార్డుల పైన MDRను వచ్చే బడ్జెట్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రద్దు చేయాలనున్నారని తెలుస్తోంది. డిజిటల్ పద్ధతుల్లో ఖాతాదారుల నుంచి చెల్లింపులు స్వీకరించినందుకు, వ్యాపారుల నుంచి బ్యాంకులు ఎండీఆర్ను చేస్తాయి. ట్రాన్సాక్షన్ మొత్తంలో కొంత శాతాన్ని లెక్కగట్టి ఎండీఆర్ విధిస్తారు.
ఎండీఆర్ ఛార్జీలు..
ఏ ట్రాన్సాక్షన్ పైన అయినా గరిష్టంగా రూ.150కి మించి ఎండీఆర్ వసూలు చేయరాదు. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి భీమ్ యూపీఐ, రూపె డెబిట్ కార్డు చెల్లింపులపై ఎండీఆర్ ఛార్జీలను రద్దు చేసింది.
రూ.50 కోట్ల టర్నోవర్ ఉంటే డిజిటల్ చెల్లింపులు..
కాగా, రూ.50 కోట్లకు పైబడిన టర్నోవర్ కలిగిన అన్ని కంపెనీలు డిజిటల్ చెల్లింపులు అందించాలి. ఒకవేళ దీనిని అమలు చేయకుంటే వారిపై రోజుకు రూ.5000 జరిమానా విధిస్తారు.