బెంగళూరు: ఇటీవల ఆటోమొబైల్ రంగంతో పాటు ఎఫ్ఎంసీజీ కూడా మందగమనం కనిపించింది. కనీసం రూ.5 బిస్కట్ ప్యాకెట్ కొనుగోలు చేయలేని పరిస్థితులు ఉన్నాయని ఇటీవల ఆందోళనలు వ్యక్తమయ్యాయి. రూ.5 పార్లే బిస్కట్ లేదా బ్రిటానియా బిస్కట్లు కూడా కొనుగోలు చేయడం లేదని, ఆటో, ఎఫ్ఎంసీజీలకు డిమాండ్ బాగా తగ్గిందని, చాలామంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితులు వచ్చాయని సంబంధిత పరిశ్రమ వర్గాలు ఆవేదన వ్యక్తం చేశాయి.
అయితే కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న ఉద్దీపన చర్యలు లేదా పండుగలు లేదా మరో కారణం కావొచ్చు... కానీ ఆయా పరిశ్రమలు కుదురుకుంటున్నట్లుగా కనిపిస్తున్నాయి. అక్టోబర్ నెలలో ప్యాసింజర్ వెహికిల్స్ సేల్స్ పెరిగాయి. తాజాగా, రూ.5 బిస్కెట్ ప్యాకెట్ కూడా కొనుగోలు చేసే పరిస్థితి ఉందని ఆందోళనలు వ్యక్తమైన నేపథ్యంలో బ్రిటానియా ఇండస్ట్రీస్ మూడో క్వార్టర్లో భారీ లాభాలు నమోదు చేసింది.

33 శాతం పెరిగిన బ్రిటానియా లాభాలు
బ్రిటానియా ఇండస్ట్రీస్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.403 కోట్ల నెట్ ప్రాఫిట్ను నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో ఆర్జించిన నికర లాభం రూ.303.3 కోట్లతో పోలిస్తే 33 శాతం వృద్ధి సాధించినట్లు బ్రిటానియా ఇండస్ట్రీస్ తెలిపింది. నికర అమ్మకాలు రూ. 2,913.55 కోట్ల నుంచి 6.98% వృద్ధి నమోదు చేసి రూ.3,116.99 కోట్లకు పెరిగినట్లు కంపనీ ఎండీ వరుణ్ బెర్రీ తెలిపారు.

తగ్గిన ఖర్చులు..
బ్రిటానియా మొత్తం ట్యాక్స్ ఖర్చులు రెండో క్వార్టర్లో రూ.95.51 కోట్లకు తగ్గాయి. బ్రిటానియా ఆర్థిక ఖర్చులు జూలై - సెప్టెంబర్ త్రైమాసికంలో 6 రెట్లు పెరిగింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయంలో ఈ ఖర్చు రూ.2.42 కోట్లు కాగా, ఇప్పుడు రూ.16.14 కోట్లకు చేరుకుంది. మొత్తం ఖర్చులు 6.64 శాతం పెరిగి రూ.2,454.58 నుంచి రూ.2,617.64కు చేరుకున్నాయి.

సీక్వెన్షియల్గా ఆదాయం 13 శాతం పెరిగింది..
బేసిక్ ఎర్నింగ్స్ పర్ షేర్ 2018 సెప్టెంబర్ 30 న రూ.12.61 కాగా, 2019 సెప్టెంబర్ 30వ తేదీన రూ.16.82కి పెరిగింది. ఫారన్ కరెన్సీ ట్రాన్స్లేషన్ రిజర్వ్ పరంగా ఈ క్వార్టర్లో రూ.2.8 కోట్లు రాగా, గత ఏడాది ఇదే సమయంలో రూ.6.54 కోట్లుగా ఉంది. మార్కెట్ కంటే వేగంగా వృద్ధి సాధించడాన్ని కొనసాగిస్తున్నామని వరుణ్ బెర్రీ తెలిపారు. సీక్వెన్షియల్గా చూస్తే ఆదాయం 13 శాతం పెరిగిందన్నారు. ముడి చమురు ధరలు పెద్దగా పెరగకపోవడంతో వ్యయాలు పెద్దగా పెరగలేదన్నారు.

బ్రిటానియా షేర్ ధర..
బ్రిటానియా షేర్ ప్రైస్ సోమవారం 1.04 శాతం తగ్గి రూ.3,125 వద్ద క్లోజ్ అయింది. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఆగస్ట్ 21వ తేదీ వరకు 23 శాతం కోల్పోయిన బ్రిటానియా షేర్ ఆగస్ట్ 21వ తేదీ నుంచి ఇప్పటి వరకు 30.73 శాతం పెరిగింది. బ్రిటానియా గుడ్ డే, టైగర్ బిస్కట్లను తయారు చేస్తోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications