తలసరి ఆదాయంలో సాంకేతికంగా భారత్ను సహచర బంగ్లాదేశ్ అధిగమించింది. నివేదిక ప్రకారం బంగ్లాదేశ్ తలసరి ఆదాయం 2020-21 ఆర్థిక ఏడాదిలో 2,227 డాలర్లుగా నమోదయింది. అంతకుముందు ఏడాది అంటే 2019-20 ఆర్థిక సంవత్సరంలో 2,064 డాలర్లుగా ఉంది. అంటే గత ఆర్థిక సంవత్సరం బంగ్లాదేశ్ తలసరి ఆదాయం తొమ్మిది శాతం మేరకు పెరిగింది. అదే సమయంలో భారత్ తలసరి ఆదాయం 1,947.417 డాలర్లుగా ఉంది. కరోనా వైరస్ మహమ్మారి, గత ఏడాది సుదీర్ఘ లాక్ డౌన్ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. దీంతో తలసరి క్షీణించింది.

ఇదీ తలసరి ఆదాయం
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీన్ నేతృత్వంలో జరిగిన వర్చువల్ కేబినెట్ సమావేశంలో ప్లానింగ్ మినిస్టర్ ఎంఏ మన్నన్ డేటాను ప్రవేశపెట్టారు. ఈ నివేదిక ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరంలో పర్ క్యాపిడా ఇన్కం 2,227 డాలర్లుగా ఉంది. అంతకుముందు సంవత్సరం 2,064 డాలర్లుగా నమోదయింది. తలసరి ఆదాయం ఈ ఏడాది కాలంలో 9 శాతం పెరిగినట్లు వెల్లడించారు.

ఆర్థిక నిపుణుల మాట
ఇది కేవలం తాత్కాలిక అంశమని, బంగ్లాదేశ్ లేబర్ ఇంటెన్సివ్ ఎగుమతులు ఎక్కువగా కలిగినదని, ఇది ఎక్కువ కాలం ఇదే వృద్ధిని కొనసాగించడం సాధ్యం కాకపోవచ్చునని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. భారత్ కంటే వేగంగా వృద్ధి ఉండకపోవచ్చునని, ఒకసారి కరోనా తగ్గుముఖం పడితే వృద్ధిలో మార్పులు ఉంటాయని, కరోనా నేపథ్యంలో కొన్ని పాలసీలతో భారత్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడిందని చెబుతున్నారు. ప్రజల ప్రాణాలకు విలువనిచ్చి గత ఏడాది ప్రపంచంలోనే సుదీర్ఘ లాక్ డౌన్ పెట్టడం వల్ల ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం చూపిన విషయం తెలిసిందే.

మానీటరీ ఫండ్
ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ గత ఏడాది అక్టోబర్ నెలలో విడుదల చేసిన వరల్డ్ ఎకనమిక్ ఔట్ లుక్ డేటా ప్రకారం బంగ్లాదేశ్ తలసరి ఆదాయంలో భారత్ను వృద్ధిని సాధిస్తుందని అంచనా వేసింది. ఫార్మర్ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ అరవింద్ సుబ్రమణియన్ మాట్లాడుతూ ఈ రెండు దేశాల వృద్ధి డేటాలను పోల్చలేమన్నారు.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications