తమ వ్యాపారం లాభాల్లోకి రావాలంటే మార్జిన్ కనీసం 7 శాతంగా ఉండాలని ఆటోమోబైల్ డీలర్స్ కోరుతున్నారు. వివిధ కారణాల వల్ల వాహనాల సేల్స్ తగ్గిపోయాయని, దీంతో పాటు కార్యకలాపాల ఖర్చులు పెరిగిపోయాయని, దీంతో లాభాలు కనిపించడం లేదని చెబుతున్నారు. అంతకుముందు మందగమనం కారణంగా, ఇప్పుడు కరోనా - లాక్ డౌన్ వల్ల ఆపరేటింగ్ కాస్ట్ పెరిగి, వాహనాల సేల్స్ తగ్గాయని గుర్తు చేస్తున్నారు.

మార్జిన్ 7 శాతం ఇవ్వాలి
ఒక్కో వాహనం విక్రయించేందుకు డీలర్లు సదరు వాహన సంస్థ నుంచి మార్జిన్ లేదా లాభం తీసుకుంటారు. కానీ గత రెండేళ్లుగా వాహనాల సేల్స్ తగ్గుతూ వస్తున్నాయి. దీంతో డీలర్లు ఆర్థికంగా నష్టపోతున్నారు. కాబట్టి తమకు ఒక్కో వాహనంపై 7 శాతం మార్జిన్ ఇవ్వాలని కోరుతున్నారు. వ్యాపారాలు మనుగడ సాగించాలంటే డీలర్ల వ్యయాలు కనీసం 20 శాతం తగ్గేలా చూడాలని వాహన కంపెనీలు డీలర్ల అసోసియేషన్ల సమాఖ్య (FADA) కోరింది.

ఖర్చుకు అనుగుణంగా మార్జిన్ లేదు
అధిక ఖర్చుల కారణంగా లాభదాయకత క్షీణిస్తోందని, తక్కువ నిర్వహణ మార్జిన్తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు డీలర్ల సమాఖ్య తెలిపింది. అలాంటి వారికి సత్వరమే సాయం అందించాలని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ (SIAM)కు డీలర్ల సమాఖ్య ప్రెసిడెంట్ ఆశిష్ హర్షరాజ్ లేఖ రాశారు. ఉద్యోగుల ఖర్చులు, రుణాలపై చెల్లించే వడ్డీలు, అద్దెలు పెరుగుతున్నాయని, దీనికి తోడు వాహనాల విక్రయాల సంఖ్య తగ్గుతోందని కానీ డీలర్ మార్జిన్ మాత్రం పెరుగుతున్న వ్యయాలకు అనుగుణంగా లేవని పేర్కొన్నారు.

3.5 శాతం మార్జిన్ ఉన్నా..
వాహన డీలర్లు కేవలం 3.5 శాతం మార్జిన్లకే విక్రయిస్తున్నారని, తద్వారా మొత్తం టర్నోవర్లో ఇది 0.5 శాతం నుండి 1 శాతం నికర లాభానికే వారు వ్యాపారాలను నిర్వహించాల్సి వస్తోందని పేర్కొన్నారు. మందగమనం కారణంగా గత పదిహేను నెలలుగా ఆ కనీస మార్జిన్లోను ఇబ్బందులు ఉన్నాయని, చాలామంది డీలర్ల వ్యాపారాలు నష్టాల్లో ఉన్నాయని తెలిపారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications