న్యూఢిల్లీ/బీజింగ్: సుమారు మూడు దశాబ్దాల తర్వాత చైనా.. భారతదేశం నుంచి బియ్యం దిగుమతులు చేసుకుంటోంది. ఆ దేశంలో బియ్యం పంపిణీ తక్కువగా ఉండటంతో మనదేశం నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్ కొంత డిస్కౌంట్ కూడా ఇవ్వడంతో మనదేశం నుంచే బియ్యం దిగుమతులు చేసుకుంటోంది.
ఈ మేరకు భారత వ్యాపారవర్గాలు వెల్లడించాయి. ప్రపంచంలో భారత్ అతిపెద్ద బియ్యం ఎగుమతిదారు కాగా, చైనా అతిపెద్ద దిగుమతిదారుగా ఉంది. బీజింగ్ మనదేశం నుంచి ఏడాదికి 4 మిలియన్ టన్నుల బియ్యాన్ని దిగుమతి చేసుకుంటోంది. అయితే, నాణ్యత సరిగా ఉండటం లేదని మరికొంత బియ్యాన్ని కొనుగోలు చేయడం లేదు.

సరిహద్దులో భారత్, చైనాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో చైనా మనదేశం నుంచి భారీ ఎత్తున బియ్యాన్ని దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటం గమనార్హం. చైనా మూడు దశాబ్దాల తర్వాత తొలిసారి భారత బియ్యాన్ని కొనుగోలు చేసిందని, భారత పంట నాణ్యత చూసిన తర్వాత వచ్చే ఏడాది ఈ కొనుగోళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని బియ్యం ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడు బీవీ కృష్ణారావు తెలిపారు.
భారతీయ వ్యాపారులు డిసెంబర్-ఫిబ్రవరిలో 100,000 టన్నుల విరిగిన బియ్యాన్ని ఎగుమతి చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. సరుకు టన్నుకు 300 డాలర్లు.
చైనా సాంప్రదాయ సరఫరాదారులైన థాయిలాండ్, వియత్నాం, మయన్మార్, పాకిస్థాన్ ఎగుమతుల కోసం పరిమితమైన మిగులు సరఫరాను కలిగి ఉన్నాయి. భారతీయ ధరలతో పోలిస్తే టన్నుకు కనీసం $ 30 ఎక్కువ కోట్ చేస్తున్నాయని భారత బియ్యం వాణిజ్య అధికారులు తెలిపారు.
More From GoodReturns

యుద్ధాన్ని వదిలి బంగారంపై కన్నేసిన చైనా.. టన్నుల కొద్ది పసిడి రహస్యంగా కొనుగోలు.. ధరల పెరుగదలపై ఆందోళన..

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

పశ్చిమాసియాలో యుద్ధం.. చమురు ధరల్లో భారీ పెరుగుదల.. ఎంతలా ఎగబాకాయంటే..

నేస్తం నేనున్నా.. భారత్కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications