భారత్లో కరోనా కల్లోలం నేపథ్యంలో అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు, సీఈవోలు స్పందిస్తున్నారు. అమెరికాలోని వాణిజ్య వర్గాలు భారత్కు అండగా ఉండేందుకు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. 40 కంపెనీల వరకు టాస్క్ఫోర్స్గా ఏర్పడి భారత్కు సహకరించాలని నిర్ణయించాయి. ఆపిల్ సీఈవో టిమ్ కుక్ కూడా భారత్కు సాయమందిస్తామని ప్రకటించారు. కష్టకాలంలో ఉన్న భారతీయులకు సాయమందించేందుకు తమవంతు సహకారం ఉంటుందని తెలిపారు. క్షేత్రస్థాయిలోని మహమ్మారి నివారణకు జరుగుతున్న కార్యక్రమాలకు విరాళాల రూపంలో తమవంతు సహకారం ఉంటుందని టిమ్ కుక్ అన్నారు.

సాయమందిస్తాం
భారత్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయని, డాక్టర్లు, కార్మికులు, ఆపిల్ కుటుంబం సహా భయంకరమైన ఈ వైరస్తో పోరాడుతున్న ప్రతి ఒక్కరి పైనే తమ ఆలోచనలు ఉన్నాయని, క్షేత్రస్థాయిలో సహాయక చర్యలకు మద్దతుగా ఆపిల్ విరాళం ఇస్తుందని టిమ్ కుక్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ సాయం ఏ రూపంలో, ఎంత మొత్తం ఉంటుందనే విషయం వెల్లడించాల్సి ఉంది. స్వచ్ఛంద సంస్థలు లేదా ప్రభుత్వానికి నేరుగా విరాళం అందించడంపై సమాలోచనలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.

సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల..
భారత్లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో భారత సంతతికి చెందిన టెక్ కంపెనీల CEOలు ఆందోళన వ్యక్తం చేశారు. తమ దేశానికి అండగా ఉండేందుకు ముందుకు వచ్చారు. సహాయక చర్యల నిమిత్తం గూగుల్ తరఫున రూ.135 కోట్ల విరాళం అందిస్తున్నట్లు సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. భారత్లో పరిస్థితులను చూసి తన గుండె బద్దలైందని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అన్నారు. సహాయక చర్యలకు తోడ్పడేలా ఆక్సిజన్ కాన్సంట్రేషన్ యంత్రాల కొనుగోలుకు చేయూతనిస్తామన్నారు.

భారీగా కేసుల నమోదు
భారత్లో ప్రతిరోజు లక్షలాది కేసులు నమోదవుతున్నాయి. సోమవారం ఒక్కరోజు మూడు లక్షల కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వరుసగా ఐదో రోజు రికార్డ్ స్థాయిలో కేసులు నమోదయ్యాయి దీంతో మొత్తంగా దేశంలో 1.73 కేసులు నమోదు కాగా, 1.95 లక్షల మరణాలు నమోదయ్యాయి. కర్ణాటకలో నేడు ఒక్కరోజే 30000 కేసులు నమోదయ్యాయి. బెంగళూరులో ఒకరోజులోనే అత్యధిక కేసులు నేడు నమోదయ్యాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications