అమరావతి: రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో కేంద్రం సహకారంతో ముందుకు సాగే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా రెవెన్యూ లోటును భర్తీ చేయాలని ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కోరుతోంది. తాజాగా, మంగళవారం రాజ్యసభలో కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ రెవెన్యూ లోటుపై మాట్లాడారు.

కొత్త పథకాలతో రెవెన్యూ లోటు పెంచారు
విభజన తర్వాత తొలి ఏడాదిలో ఏపీ ప్రభుత్వానికి వచ్చిన రెవెన్యూ లోటు రూ.4,117.89 కోట్లు అన్నారు. ఇందులో రూ.3,979.50 కోట్లు కేంద్రం ఇప్పటికే విడుదల చేసినట్లు తెలిపారు. అయితే కొత్త పథకాలను ప్రారంభించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ లోటును రూ.13,872.44 కోట్లకు పెంచినట్లు కాగ్ తమ దృష్టికి తెచ్చిందన్నారు.

దాదాపు అన్నీ ఇచ్చేశాం
2014-15లో ఏపీకి తలెత్తిన రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని విభజన సమయంలో హామీ ఇచ్చారని, ఇప్పటికో లోటు భర్తీకి చెందిన నిధులను కేంద్రం విడుదల చేయలేదని రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యులు కేవీపీ రామచంద్ర రావు లిఖితపూర్వకంగా అడిగిన ప్రశ్నకు అనురాగ్ ఠాకూర్ స్పందించారు. 4వేల కోట్లకు గాను మూడువేల తొమ్మిది వందల కోట్లు ఇచ్చినట్లు చెప్పారు.

ఏపీ, తెలంగాణలకు ఆ నిధులూ ముట్టజెప్పాం
అలాగే, ఏపీ విభజన చట్టంలోని నిబంధనల ప్రకారం వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఏడాదికి రూ.350 కోట్ల చొప్పున మూడేళ్లలో రూ.1,050 కోట్లు, తెలంగాణకు రూ.450 కోట్ల చొప్పున నాలుగేళఅలలో రూ.1,800 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.

జీఎస్టీ నిధులపై విజయసాయి రెడ్డి
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఏపీకీ రావాల్సిన రెవెన్యూ లాస్ కంపన్షేషన్ ఆలస్యమవుతోందని రాజ్యసభలో లేవనెత్తారు. ఈ ఏడాది ఆగస్ట్ నెల వరకు ఏపీ జీఎస్టీ ఆదాయ నష్టాన్ని చూస్తోందని, జీఎస్టీ రెవెన్యూ లాస్ను రూ.1,605 కోట్లుగా అధికారులు లెక్కించారన్నారు. జీఎస్టీ నష్టాన్ని రెండు నెలలకు ఓసారి కేంద్రం విడుదల చేయడం తప్పనిసరి అన్నారు. ఆగస్ట్, సెప్టెంబర్ నెలలకు గాను అక్టోబర్లో చెల్లించాల్సిన నష్టపరిహారం ఇంకా చెల్లించలేదన్నారు. అక్టోబర్, నవంబర్ నిధులు కూడా డిసెంబర్ వరకు చెల్లించాల్సి ఉందన్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications