అమరావతి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం (జనవరి 9) ఆంధ్రప్రదేశ్లో అమ్మఒడి పథకానికి శ్రీకారం చుట్టారు. చిత్తూరు జిల్లాలో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించిన అనంతరం అమ్మఒడిని ప్రారంభించారు. జిల్లాల్లో మంత్రులు ప్రారంభించారు. అర్హులైన తల్లులను పాఠశాలలకు ఆహ్వానించి ఈ పథకాన్ని ప్రారంభించారు. పిల్లలను స్కూల్కు పంపించే పేద తల్లులకు ఈ కానుక అందుతుంది.

తల్లి పేరు మీద డబ్బులు
అమ్మఒడి పథకం కింద ప్రతి తల్లికి ఏడాదికి రూ.15,000 అందుతుంది. ఒకటి నుంచి ఇంటర్ చదివే విద్యార్థులకు.. వారి తల్లి అకౌంట్లో డబ్బులు వేస్తారు. ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్ స్కూల్స్లో చదివే విద్యార్థులకు ప్రయోజనం.

ఎంత కేటాయింపు, ఎంతమంది లబ్ధిదారులు...
అమ్మఒడి పథకానికి ప్రభుత్వం రూ.6,456 కోట్లు కేటాయించింది. ఈ పథకం ద్వారా లక్షలాది మంది పేద కుటుంబం వారికి ప్రయోజనం చేకూరుతుంది. అమ్మఒడి ద్వారా 82 లక్షల మంది విద్యార్థులకు బెనిఫిట్ కలుగుతుంది. 43 లక్షల మంది తల్లుల అకౌంట్లలో డబ్బులు పడతాయి.

ప్రతి జిల్లాలోను లక్షలాది మంది..
ఈ పథకం కింద లబ్ధి పొందే వారిలో దాదాపు ప్రతి జిల్లాలో రెండు లక్షల మంది నుంచి మూడు లక్షలకు పైగా ఉన్నారు. 7,231 మంది అనాథ పిల్లలు లబ్ధి పొందుతున్నారు.

జాబితాలో పేరు లేకపోయినా...
జాబితాలో తల్లులు లేదా సంరక్షకుల పేర్లు లేకపోయినా ఆందోళన అవసరం లేదు. వారు సంబంధిత ధృవీకరణ పత్రాలతో గ్రామ లేదా వార్డు సచివాలయాల దృష్టికి, ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోల దృష్టికి తీసుకు వెళ్తే వారు పరిశీలించి అర్హులైతే అమ్మఒడి అందేలా చేస్తారు. సకాలంలో ధృవపత్రాలు అందచేయని పక్షంలో తమ పత్రాలను గ్రామ లేదా వార్డు సచివాలయాలు, ఎంఈవోల దృష్టికి తీసుకు వెళ్లాలని విద్యాశాఖ పేర్కొంది.

నేరుగా మీ బ్యాంకు ఖాతాలోకి రూ.15వేలు బదలీ చేస్తున్నా...
గురువారం చిత్తూరు జిల్లాలో జగన్ అమ్మఒడి పథకాన్ని ప్రారంభించారు. అంతకుముందు బుధవారం ఆయన తల్లులకు లేఖలు రాశారు. అమ్మఒడి ఆర్థిక సాయం అందుకోనున్న తల్లులకు అభినందనలు. పేదింటి తల్లులు తమ బిడ్డల్ని చదివించుకునేందుకు పడుతున్న బాధలు పాదయాత్రలో చూశాను. అందుకే మేనిఫెస్టోలో అమ్మఒడి పెట్టి, ఇప్పుడు అమలు చేస్తున్నాం. నేరుగా మీ బ్యాంకు ఖాతాలో రూ.15వేలు బదలీ చేస్తున్నా. ఈ సొమ్ముతో మీ పిల్లల్ని బాగా చదివించండి. మీ లాంటి 43 లక్షల మంది తల్లులకు రూ.6,500 కోట్ల మేర ఆర్థిక సాయం అందిస్తున్నందుకు సంతోషంగా ఉందని జగన్ లేఖలో పేర్కొన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications