కరోనా నేపథ్యంలో గత ఏడాది మార్చి 23 నుండి మూడు నెలలకు పైగా లాక్ డౌన్ విధించడంతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. దశలవారీగా లాక్ డౌన్ ఆంక్షలు సడలించినప్పటికీ, కరోనా కేసులు, భయాల వల్ల వరుసగా రెండు త్రైమాసికాల్లో వృద్ధి రేటు ప్రతికూలంగా నమోదయింది. మొదటి త్రైమాసికంలో మైనస్ 23.9 శాతం, రెండో త్రైమాసికంలో మైనస్ 7 శాతంగా నమోదయింది.
అయితే మూడో త్రైమాసికంలో కాస్త పాజిటివ్ కనిపించింది. నాలుగో త్రైమాసికం మరింత బాగుంటుందని ఆశాజనకంగా ఉన్నారు. కరోనా నుండి భారత్ వేగంగా కోలుకుంటోందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు చెబుతున్నాయి. తాజాగా ప్రపంచ బ్యాంకు కూడా భారత్ ఇంత వేగంగా కోలుకోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. 'అద్భుతం, భారత్ వేగంగా పుంజుకుంది' అని పేర్కొంది.

అద్భుతంగా బయటపడింది
కరోనా నేపథ్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు దోహదపడ్డాయి. ప్రపంచంలోనే అతిపెద్ద లాక్ డౌన్ వల్ల ఎన్నో ప్రాణాలు నిలబడ్డాయి. అదే సమయంలో ఆర్థిక వ్యవస్థ దారుణంగా పతనమైంది. కానీ ఈ పరిస్థితి నుండి భారత్ గోడకు కొట్టిన బంతిలా పైకి లేస్తోందని అంటున్నారు. ఇప్పటికే భారత వృద్ధి రేటు అంచనాలను రేటింగ్ ఏజెన్సీలు ఎప్పటికప్పుడు సానుకూలంగా సవరిస్తున్నాయి. కరోనా సంక్షోభం నుండి భారత్ అద్భుతంగా పుంజుకుందని ప్రపంచ బ్యాంకు తెలిపింది. అయితే ఇంకా పూర్తిగా బయటపడలేదని పేర్కొంది.

వచ్చే సంవత్సరం అంచనా
FY22లో జీడీపీ 7.5 శాతం నుండి 12.5 శాతం మధ్య ఉండవచ్చునని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. వ్యాక్సినేషన్ వేగం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, మరోసారి ఆంక్షల వంటి అంశాలు భారత ఆర్థిక వ్యవస్థ గమనాన్ని నిర్దేశించనున్నట్లు పేర్కొంది. కరోనా సెకండ్ వేవ్, ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్... ఇప్పుడు భారత్ ముందు ఉన్న అతి పెద్ద సవాళ్లు అని పేర్కొంది. అలాగే స్థూలంగా భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకున్నప్పటికీ ఇంకా కొన్ని గణాంకాల్లో అస్థిరత నెలకొందని ప్రపంచ బ్యాంకు దక్షిణాసియా విభాగంలో ప్రధాన ఆర్థికవేత్త హన్స్ టిమ్మర్ తెలిపారు. ఇందుకు కారణంగా రెండేళ్లుగా ఎలాంటి వృద్ధి లేకపోవడమేనని అభిప్రాయపడ్డారు. దేశ తలసరి ఆదాయం పడిపోయిందన్నారు.

వృద్ధి... ఉపాధి
ఆర్థిక పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకునే కొద్దీ కరెంట్ ఖాతా లోటు తిరిగి పూర్వస్థితికి చేరుకుంటుందని నివేదిక అంచనా వేసింది. ద్రవ్య విధానంలో సరైన మార్పులు, అంతర్జాతీయంగా ద్రవ్యలభ్యత వంటి అంశాలు పెట్టుబడులకు మార్గం సుగమం చేయనున్నాయన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు ఆర్థిక లోటు జీడీపీలో పది శాతం వరకు ఉంటుందని పేర్కొంది. వృద్ధి పుంజుకునే కొద్ది ఉపాధి పెరిగి, పేదరికం గాడిలోకి వస్తుందని వెల్లడించింది.
More From GoodReturns

నేస్తం నేనున్నా.. భారత్కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications