దేశంలో 5G నెట్వర్క్కు సంబంధించి టెలికం శాఖ 2021 జనవరి-మార్చి మధ్య వేలం నిర్వహించే అవకాశం ఉందని భారతీ ఎయిర్టెల్ వెల్లడించింది. కానీ అధిక ధరలు ఉంటే మాత్రం తాము ఈ స్పెక్ట్రం వేలంలో పాల్గొనబోమని భారతీ ఎయిర్టెల్ తేల్చి చెప్పింది. రిజర్వ్ ధర ఎక్కువగా ఉంటే బిడ్డింగ్కు తాము దూరంగా ఉంటామని బుధవారం వెల్లడించింది. స్పెక్ట్రం వేలాన్ని వ్యూహాత్మకంగా పరిశీలిస్తున్నామని, 1,000 మెగాహెట్జ్ ఫ్రీక్వెన్సీలకు దిగువన ఉన్న కొన్ని రేడియో తరంగాల ఫ్రీక్వెన్సీల కోసం చూస్తున్నామని ఎయిర్టెల్ ఇండియా, దక్షిణాసియా ఎండీ, సీఈవో గోపాల్ విఠల్ అన్నారు.
ప్రస్తుతం స్పెక్ట్రం వేలానికి సంబంధించి కంపెనీ ఆలోచన చేస్తోందన్నారు. ముఖ్యంగా ఇంటి లోపల, గ్రామీణ ప్రాంతాల్లో నెట్ వర్క్ సామర్థ్యాన్ని పెంచేందుకు వెయ్యి మెగాహెట్జ్ ఫ్రీక్వెన్సీ కొనుగోలుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని, 5జీకి రిజర్వ్ ధర ఎక్కువ ఉంటే మాత్రం బిడ్లో పాల్గొనమని చెప్పారు. తాము అంత ధర భరించలేమన్నారు. గతంలోను ఆయన ఇదే విషయం వెల్లడించారు.

కాగా, ప్రస్తుతం 5G సేవలకు అనువైన 3,300-3,600 మెగాహెట్జ్ శ్రేణిలో స్పెక్ట్రం కోసం ఒక్కో మెగాహెట్జ్ ధరను రూ.492 కోట్లుగా ట్రాయ్ సిఫార్స్ చేసింది. ట్రాయ్ ప్రకారం 5జీ స్పెక్ట్రం కోసం కంపెనీ రూ.50వేల కోట్లు వెచ్చించవలసి వస్తుందని ఎయిర్టెల్ అంచనా. అంత మొత్తం తాము భరించలేమని తెలిపింది. 2జీ సేవల వినియోగం తగ్గుతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన 1800 మెగాహెట్జ్ ఫ్రీక్వెన్సీ బ్యాండును కొనుగోలు విషయంపై ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. 4జీ సేవలపై దృష్టి సారించేందుకు 2,300 మెగాహెట్జ్ ఫ్రీక్వెన్సీ బ్యాండుపై దృష్టి సారించే అవకాశం ఉందన్నారు. రూ.2500 నుండి రూ.3వేల మధ్య జియో 5జీ స్మార్ట్ ఫోన్ అధ్యయనం చేస్తున్నామని తెలిపారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications