భారతీ ఎయిర్టెల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) పరిమితిని 49 శాతం నుంచి 100 శాతానికి పెంచుకునేందుకు టెలికం విభాగం (DoT) అనుమతిని ఇచ్చింది. కంపెనీలో 74 శాతం వరకు విదేశీ పెట్టుబడిదారుల వాటా అట్టిపెట్టుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇప్పటికే అనుమతించింది.
ఎయిర్టెల్ పెయిడప్ మూలధనంలో 100 శాతం వరకు FDIలకు డాట్ ఆమోదం లభించినట్లు కంపెనీ ఎక్స్చేంజీలకు ఇచ్చిన సమాచారంలో తెలిపింది. త్వరలో ప్రభుత్వానికి దాదాపు రూ.35,586 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సిన నేపథ్యంలో ఎయిర్టెల్కు ఈ అనుమతి వచ్చింది. FDIలను 100 శాతానికి పెంచుకునేందుకు తమకు DoT 20, జనవరి 2020 తేదీన అనుమతి ఇచ్చిందని పేర్కొంది.

భారతీ ఎయిర్టెల్ ఏజీఆర్, ఇతర డ్యూస్ను ప్రభుత్వానికి చెల్లించవలసి ఉంది. రూ.35,586 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఈ చెల్లింపులకు ముందు విదేశీ పెట్టుబడుల పెంపుకు ఆమోదం లభించడం ఎయిర్టెల్కు భారీ ఊరట కలిగించే విషయం. ఎయిర్టెల్ బకాయిలలో రూ.21,682 కోట్లు లైసెన్స్ ఫీజు, మరో రూ.13,904 కోట్లు స్పెక్ట్రమ్ బకాయిలు (టెలినార్, టాటా టెలిసర్వీస్ బకాయిలను మినహాయించి) ఉన్నాయి.
ఈ కష్టాల నుంచి బయటపడేందుకు ఎయిర్టెల్ సుమారు రూ.4,900 కోట్ల విదేశీ పెట్టుబడులను రాబట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా సింగపూర్కు చెందిన సింగ్ టెల్ అనే కంపెనీ సహా మరికొన్ని సంస్థల నుంచి ఆ మొత్తాన్ని పెట్టుబడుల రూపంలో సేకరించనుంది. గత ఏడాది ప్రారంభంలోనూ విదేశీ పెట్టుబడుల కోసం ఎయిర్టెల్ టెలికాం శాఖకు దరఖాస్తు చేసుకునన్నప్పటికీ దానిని తిరస్కరించింది. విదేశీ పెట్టుబడులపై పూర్తి స్థాయి సమాచారం అందించకపోవడంతో దరఖాస్తుని నాడు తిరస్కరించింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications