న్యూఢిల్లీ: ఎయిరిండియా కొనుగోలుకు పలు సంస్థలు ఆసక్తిగా ఉన్నాయి. ఇప్పటికే టాటా గ్రూప్తో పాటు ఎయిరిండియా ఉద్యోగులు కూడా సంస్థ కొనుగోలు కోసం కంపెనీ కొనుగోలుకు ఆసక్తికర వ్యక్తీకరణ(EOI) బిడ్ను దాఖలు చేశారు. బిడ్ దాఖలుకు సోమవారం (డిసెంబర్ 14) సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇచ్చారు. గడువులోగా పలువురు సంస్థలు EOI దాఖలు చేశాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిరిండియా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం గత కొద్ది నెలలుగా ప్రయత్నాలు చేస్తోంది. టాటాతో పాటు ఇంటరప్స్ సంస్థ కూడా EOI దాఖలు చేసింది.

ఇవి దక్కుతాయి..
ఎయిరిండియాలో ప్రభుత్వ వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి, పలు EOIలు దాఖలయ్యాయని, ఈ ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు రెండో దశకు చేరిందని పెట్టుబడులు, ప్రభుత్వ ఉపసంహరణ విభాగం (దీపమ్) కార్యదర్శి తుహిన్ కాంత పాండే ట్వీట్ చేశారు. ఎవరెవరు, ఎంత బిడ్ దాఖలు చేశారనే విషయాన్ని వెల్లడించాల్సి ఉంది.
బిడ్ దక్కించుకునే వారికి ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్లో 100 శాతం వాటా దక్కుతుంది. దేశీయ విమానాశ్రయాల్లో 4,400 దేశీయ, 1800 అంతర్జాతీయ ల్యాండింగ్, పార్కింగ్ స్లాట్స్ దక్కుతాయి. విదేశీ విమానాశ్రయాల్లో 900 స్లాట్స్ దక్కుతాయి. కార్గో, గ్రౌండ్, హ్యాండ్లింగ్ సేవలు అందించే ఏఐఎస్ఏటీఎస్లో 50 శాతం వాటా ఉంటుంది. జనవరి 6వ తేదీలోగా బిడ్స్ అర్హతపై ఆయా బిడ్డర్లకు ట్రాన్సాక్షన్స్ సలహాదారు సమాచారం అందించనున్నారని తెలుస్తోంది.

అమెరికా సంస్థ కూడా.. తెలుగువారే
2019 మంది ఎయిరిండియా ఉద్యోగుల బృందం కూడా EOI దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఉద్యోగుల్లో ప్రతి ఒక్కరు కనీసం రూ.1 లక్ష ఇందుకు కేటాయించారు. ఉద్యోగులు ఏదైనా ఆర్థిక సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకోనున్నారని తెలుస్తోంది. కాగా, బిడ్డింగ్లో ఉద్యోగులతో కలిసి అమెరికాకు చెందిన సంస్థతో కలిసి ఈ EOI దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. ఉద్యోగులు 51 శాతం వాటా, మిగతా వారు 49 శాతం వాటాను కొనేందుకు ఇంటరప్స్ అంగీకరించినట్లుగా తెలుస్తోంది. ఇంటరప్స్ సంస్థ చైర్మన్ తెలుగువారు లక్ష్మీప్రసాద్.

అప్పులు కూడా భరించాలి
ప్రస్తుత ఎయిరిండియాను 1932లో టాటా ఎయిర్ లైన్స్ పేరిట టాటా గ్రూప్ నెలకొల్పింది. 1946లో ఎయిరిండియాగా మారింది. 1953లో ప్రభుత్వం సొంతం చేసుకుంది. ఇప్పుడు 67 సంవత్సరాల తర్వాత అదే ఎయిరిండియాను సొంతం చేసుకునేందుకు టాటా సంస్థ ముందుకు రావడం గమనార్హం. ఎయిరిండియా కొనుగోలు రేసులో నిలిచే కంపెనీ రూ.23,000 కోట్ల రుణాలను భరించవలసి ఉంటుంది. ఎయిరిండియా మొత్తం రుణాలలో మిగిలిన వాటాను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న SPVకి బదలీ చేయనున్నారు. ఎయిరిండియా ఎంటర్ప్రైజ్ వ్యాల్యూను మార్కెట్ క్యాపిటలైజేషన్, స్వల్ప, దీర్ఘకాలిక రుణాలు, బ్యాలన్స్ షీట్లో ఉన్న నగదు తదితరాల ఆధారంగా నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications