విమానయానరంగ దిగ్గజం ఎయిరిండియా 48 మంది పైలెట్లను తొలగిస్తూ అర్దరాత్రి నిర్ణయం తీసుకున్నది. కరోనా మహమ్మారి కారణంగా నష్టాల్లో ఉన్న ఎయిరిండియా ఈ పైలెట్లను తొలగించింది. ఉద్వాసనకు గురైన 48 మంది పైలెట్లు గత ఏడాది రాజీనామా చేస్తూ ఆరు నెలల నోటీసు ఇచ్చినప్పటికీ, ఆ తర్వాత ఉపసంహరించుకున్నారు. ఎయిర్ బస్ 320 విమానాలకు చెందిన పైలెట్లను తొలగించింది. అంతకుముందు రాజీనామాలు అంగీకరించినప్పటికీ, ఆ తర్వాత గురువారం రాత్రి హఠాత్తుగా వెనక్కి తీసుకుంది. వారిని వెంటనే తొలగిస్తున్నట్లు తెలిపింది.

ఉద్యోగం నుండి తొలగించినట్లు తెలియకుండానే.
కరోనా మహమ్మారి ప్రభావం కమర్షియల్ కార్యకలాపాలపై పడటం, ఆదాయ క్షీణతల వంటి వివిధ కారణాలతో వారిని తొలగిస్తున్నట్లు ఎయిరిండియా తెలిపింది. ఇందులో కొంతమంది పైలట్లకు శుక్రవారం ఉదయం కూడా తమను ఉద్యోగం నుండి తొలగించినట్లు తెలియకపోవడం గమనార్హం. అందులో కొంతమంది అప్పటికి విధుల్లో భాగంగా విమాన ప్రయాణంలో ఉన్నారు. ఆ సమయంలోనే వీరికి షాక్ తగిలింది.

అన్యాయంగా.. హఠాత్తుగా తొలగింపు
పైలెట్ల తొలగింపు ఉత్తర్వులను రద్దు చేయాలని ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్(ICPA) ఎయిరిండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బన్సాల్ను కోరింది. పైలట్లను అన్యాయంగా, హఠాత్తుగా తొలగించారని, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది. పైలట్లు 2019 జూలైలో రాజీనామా చేశారు. ఆ తర్వాత నిబంధనల మేరకు ఆరు నెలల లోపు ఉపసంహరించుకున్నారు. వాటిని యాజమాన్యం కూడా అంగీకరించింది. కానీ వారిని హఠాత్తుగా మొన్న రాత్రి నుండి తొలగించింది.

ఎయిరిండియాపై టాటా సన్స్ ఆసక్తి
ఎయిరిండియాను కొనుగోలు చేసే అంశంపై టాటా సన్స్ దృష్టి సారించినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. ఎయిరిండియాను వశం చేసుకోవడానికి ఈ నెల చివరి వరకు అధికారికంగా బిడ్స్ దాఖలు చేసే అవకాశముందని, ఇప్పటికే ఈ సంస్థకు సంబంధించిన వివిధ అంశాలను టాటా సన్స్ పరిశీలిస్తోందని తెలుస్తోంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications