దేశంలో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్, ప్లిప్కార్ట్ భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తూ పోటీతత్వ చట్టాన్ని (కాంపిటీషన్ లా)ను ఉల్లంఘిస్తున్నారని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) గుర్రుగా ఉంది. ఈ రెండు సంస్థలపై విచారణ జరిపేందుకు జనవరి నెలలో కమిటీని కూడా ఏర్పాటుచేసింది. అయితే దీనిపై ఇదివరకే అమెజాన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో విచారణకు బ్రేక్ పడింది. తాజాగా ప్లిప్కార్ట్ కూడా కోర్టులో పిటిషన్ ఫైల్ చేసింది. ఈ మేరకు ప్రముఖ వార్తాసంస్థ 'రాయిటర్స్' పేర్కొన్నది.

ఎంక్వైరీ..
ఈ-కామర్స్ సంస్థలపై జనవరిలో సీసీఐ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. విచారణపై కోర్టులో ప్లిప్కార్ట్ కూడా పిటిషన్ వేసింది. తమపై కావాలనే సీసీఐ పిటిషన్ వేసిందని అందులో పేర్కొన్నది. ఇదివరకే అమెజాన్ పిటిషన్ వేయగా.. అమెరికా అధ్యక్షుడు భారత్లో అడుగిడే కొద్దిరోజుల ముందు ప్లిప్కార్ట్ పిటిషన్ వేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ట్రంప్ పర్యటన నేపథ్యంలో..
దిగుమతి చేసుకొనే వస్తువులపై భారత్ సుంకం విధిస్తోందని పెద్దన్న అమెరికా ఇప్పటికే కాస్త గుర్రుగా ఉంది. ఈ క్రమంలో ప్లిప్కార్ట్ పిటిషన్ వేయడం చర్చకు దారితీసింది. అంతేకాదు ఈ నెల 18వ తేదీన బెంగళూరులో గల తమ కార్యాలయానికి సంబంధించి ప్రాథమిక ఆధారం లేకుండా విచారణ జరుపుతోన్నారని ప్లిప్కార్ట్ పేర్కొన్నది. సీసీఐ విచారణ సహేతుకం కాదని.. ఎలాంటి ఆధారం లేకుండా విచారణ జరపడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.

కంపెనీని తక్కువగా చూడటమే..
సీసీఐ చర్య ఓ సంస్థను తక్కువ చేసి చూడటమేనని.. విశ్వసనీయత, ప్రతిష్టను తగ్గించడమేనని కంపెనీ గుర్తుచేసింది. దీనిని సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ గురించి వివరణ అడగగా ప్లిప్కార్ట్ ప్రతినిధి సాధారణంగా జరిగే ప్రక్రియే అని తెలిపారు. వచ్చేవారం కోర్టులో విచారణ జరుగుతుందని చెప్పారు. కోర్టులో ప్లిప్కార్ట్ పిటిషన్పై సీసీఐ కూడా స్పందించేందుకు నిరాకరించింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications