ముంబై: దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదాని చేతికి మరో భారీ ప్రాజెక్ట్ అందింది. ప్రభుత్వ రంగంలో ఉన్న చమురు కంపెనీల కంటే ఎక్కువగా ఈ ప్రాజెక్ట్ను దక్కించుకోగలిగింది. ఆటోమొబైల్ సెగ్మెంట్ కోసం దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాల్లో రిటైల్ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ అవుట్లెట్లను నెలకొల్పడం, ఆయా నగరాల్లో పైప్లైన్ల ద్వారా వంటగ్యాస్ను సరఫరా చేయడానికి ఉద్దేశించిన ప్రాజెక్ట్ ఇది. ఇందులో 14 నగరాల్లో సీఎన్జీ అవుట్లెట్లు, పైప్లైన్ ద్వారా వంటగ్యాస్ను సరఫరా చేయడానికి లైసెన్స్ను పొందింది గౌతమ్ అదాని గ్రూప్ కంపెనీ.

అదాని టోటల్కు..
ఆ కంపెనీ పేరు అదాని టోటల్. అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో ఇదీ ఒకటి. ఇది జాయింట్ వెంచర్గా ఏర్పడింది. అదాని- ఫ్రాన్స్కు చెందిన టాప్ ఎనర్జీ కంపెనీ టోటల్.. సంయుక్తంగా దీన్ని నెలకొల్పాయి. అదాని టోటల్ గ్యాస్ లిమిటెడ్గా ఆవిర్భవించాయి. దేశవ్యాప్తంగా 65 నగరాల్లో సీఎన్జీ అవుట్లెట్లు, పైప్లైన్ ద్వారా వంటగ్యాస్ను సరఫరా చేయడానికి పెట్రోలియం, నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్ నిర్వహించిన బిడ్డింగ్స్లల్లో ఈ కంపెనీ పాల్గొంది.

తొమ్మిది నగరాలు విత్ హెల్డ్లో
ఇందులో 56 నగరాల కేటాయింపులను ప్రకటించింది రెగ్యులేటరీ బోర్డు. మిగిలిన తొమ్మిది నగరాలు.. అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటోన్న ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్కు చెందినవి కావడంతో వాటిని విత్ హెల్డ్లో ఉంచింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండటం వల్ల ఆ నగరాలను ఇంకా ఎవరికీ కేటాయించలేదు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ తొలగిపోయిన తరువాత ఆయా నగరాల పేర్లను వెల్లడిస్తామని రెగ్యులేటరీ బోర్డు వెల్లడించింది.

14 సిటీలు అదాని చేతికి..
కాగా- ఈ 52 నగరాల్లో అత్యధికంగా 14 నగరాల (జాగ్రఫికల్ ఏరియాస్)కు సంబంధించిన లైసెన్స్ను సాధించగలిగింది. హైదరాబాద్కు చెందిన మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) 13 నగరాలకు చెందిన లైసెన్స్ పొందింది. ప్రభుత్వరంగంలో కొనసాగుతున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్.. ఎనిమిది నగరాలను దక్కించుకుంది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్కు నాలుగు జాగ్రఫికల్ ఏరియాస్ లభించాయి. హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్, థింక్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక్కొక్క నగరాన్ని పొంద గలిగాయి.

కర్నూలు, గుంటూరులకు..
అస్సాం, ఛత్తీస్గఢ్లల్లో నాలుగు నగరాలు మహారాష్ట్రలోని అమరావతి, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్లల్లో రెండేసి సిటీల చొప్పున నగరాలు అదాని చేతికి చేరాయి. ఏపీలోని కర్నూలు, గుంటూరు, హైపొటెన్షియల్ జాగ్రఫికల్ ఏరియా జమ్మూ, తమిళనాడులోని మధురై, మహారాష్ట్రలోని బీడ్, జల్గావ్, రాజస్థాన్లోని కికర్, తమిళనాడులోని ధర్మపురి, మధురై, కన్యాకుమారి, పశ్చిమ బెంగాల్లోని మేదినిపూర్ నగరాలకు ఐఓసీ గ్యాస్ సరఫరా చేస్తుంది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications