రానున్న అయిదేళ్లలో భారత్ను ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారు చేసేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా రూ.45,000 కోట్ల ఫండ్ను సిద్ధం చేస్తోంది. ఆపిల్, శాంసంగ్, హువావే, ఒప్పో, వివో వంటి పెద్ద సంస్థలతో పాటు ఫాక్స్కాన్, విస్ట్రాన్ వంటి కాంట్రాక్ట్ తయారీదారులతో భారత్ను గ్లోబల్ సప్లై చైన్గా మార్చేందుకు ఈ నిధిని కేటాయిస్తోంది.

ఈ నిధులు ఎలా ఇస్తారంటే
రూ.45,000 కోట్ల ఫండ్లో రూ.41,000 కోట్లు కంపెనీలకు... ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక (PLI) ప్రమాణాల ఆధారంగా కేటాయిస్తారు. మిగిలిన రూ.4,000 కోట్ల మొత్తాన్ని ప్రతిపాదిత మూలధన రాయితీ లేదా రీయింబర్సుమెంట్స్ పథకం కింద ఇస్తారు. ప్రతిపాదిత పథకాన్ని మోడిఫైడ్ స్పెషల్ ఇన్సెంటివ్ ప్యాకేజీ స్కీం (M-SIPS)తో భర్తీ చేస్తారు.

ఉద్యోగాలు, ఎగుమతులు...
ఈ స్కీం ద్వారా 2,00,000 ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అలాగే రూ.5 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు ఉంటాయని భావిస్తోంది. అయిదేళ్లలో ప్రత్యక్ష పన్నుల ఆధాయం రూ.5,000 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తోంది.

వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కు అనుగుణంగా..
ఈ కొత్త విధానం వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (WTO)కు మరింత అనుగుణంగా సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ నిధులను స్థానిక మార్కెట్కు అనుగుణంగా డివైస్లు తయారు చేసేవారు ఈ నిధులను ఉపయోగించకుండా కట్టుదిట్టమైన ప్రమాణాలు ఉండనున్నాయని తెలుస్తోంది.

వీటి మార్కెట్ ఎంతంటే
ప్రపంచంలోనే అతిపెద్ద కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఫాక్స్కాన్తో పాటు శాంసంగ్, హువావే, వివో, ఒప్పో కలిసి ప్రపంచ మొబైల్ మార్కెట్లో 500 బిలియన్ డాలర్ల వ్యాల్యూను కలిగి ఉన్నాయి. మొబైల్ ఫోన్ మార్కెట్లు ఇది 80 శాతం కంటే ఎక్కువ మార్కెట్ను కలిగి ఉన్నాయి.
More From GoodReturns

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

పశ్చిమాసియాలో యుద్ధం.. చమురు ధరల్లో భారీ పెరుగుదల.. ఎంతలా ఎగబాకాయంటే..

నేస్తం నేనున్నా.. భారత్కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

ఎర్ర సముద్రంలో కల్లోలం..భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్..తడిసిమోపెడవుతున్న ఛార్జీలు..

యురేనియం నుంచి వాణిజ్యం వరకు.. మోదీ–కార్నీ భేటీలో జరిగిన ఒప్పందాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!



Click it and Unblock the Notifications