మోడీ ప్రభుత్వం కీలక అడుగు: ఇండియా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కోసం రూ.45,000 కోట్లు
రానున్న అయిదేళ్లలో భారత్ను ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారు చేసేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా రూ.45,000 కోట్ల ఫండ్ను సిద్ధం చేస్తోంది. ఆపిల్, శాంసంగ్, హువావే, ఒప్పో, వివో వంటి పెద్ద సంస్థలతో పాటు ఫాక్స్కాన్, విస్ట్రాన్ వంటి కాంట్రాక్ట్ తయారీదారులతో భారత్ను గ్లోబల్ సప్లై చైన్గా మార్చేందుకు ఈ నిధిని కేటాయిస్తోంది.
బ్యాంకు అకౌంట్ ద్వారా పీపీవో నెంబర్ పొందవచ్చు, ప్రయోజనాలివే!
ఈ నిధులు ఎలా ఇస్తారంటే
రూ.45,000 కోట్ల ఫండ్లో రూ.41,000 కోట్లు కంపెనీలకు... ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక (PLI) ప్రమాణాల ఆధారంగా కేటాయిస్తారు. మిగిలిన రూ.4,000 కోట్ల మొత్తాన్ని ప్రతిపాదిత మూలధన రాయితీ లేదా రీయింబర్సుమెంట్స్ పథకం కింద ఇస్తారు. ప్రతిపాదిత పథకాన్ని మోడిఫైడ్ స్పెషల్ ఇన్సెంటివ్ ప్యాకేజీ స్కీం (M-SIPS)తో భర్తీ చేస్తారు.
ఉద్యోగాలు, ఎగుమతులు...
ఈ స్కీం ద్వారా 2,00,000 ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అలాగే రూ.5 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు ఉంటాయని భావిస్తోంది. అయిదేళ్లలో ప్రత్యక్ష పన్నుల ఆధాయం రూ.5,000 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తోంది.
వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కు అనుగుణంగా..
ఈ కొత్త విధానం వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (WTO)కు మరింత అనుగుణంగా సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ నిధులను స్థానిక మార్కెట్కు అనుగుణంగా డివైస్లు తయారు చేసేవారు ఈ నిధులను ఉపయోగించకుండా కట్టుదిట్టమైన ప్రమాణాలు ఉండనున్నాయని తెలుస్తోంది.
వీటి మార్కెట్ ఎంతంటే
ప్రపంచంలోనే అతిపెద్ద కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఫాక్స్కాన్తో పాటు శాంసంగ్, హువావే, వివో, ఒప్పో కలిసి ప్రపంచ మొబైల్ మార్కెట్లో 500 బిలియన్ డాలర్ల వ్యాల్యూను కలిగి ఉన్నాయి. మొబైల్ ఫోన్ మార్కెట్లు ఇది 80 శాతం కంటే ఎక్కువ మార్కెట్ను కలిగి ఉన్నాయి.