2.5 బిలియన్ డాలర్లు నష్టపోయిన బిట్ కాయిన్ ఇన్వెస్టర్లు
గ్లోబల్ క్రిప్టోకరెన్సీ నేడు (డిసెంబర్ 6) క్షీణించింది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావం స్టాక్ మార్కెట్, క్రిప్టో మార్కెట్ పైన కనిపిస్తోంది. క్రిప్టో పైన భారత బిల్లు, ఒమిక్రాన్ ప్రభావం వల్ల బిట్ కాయిన్, ఎథేరియం సహా వివిధ క్రిప్టోలు పతనమవుతున్నాయి. గ్లోబల్ క్రిప్టోకరెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2.17 ట్రిలియన్ డాలర్ల వద్ద ఉంది. బిట్ కాయిన్ ఉదయం 47,621.34 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సాయంత్రానికి వెయ్యి డాలర్లు క్షీణించి 48,251 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. బిట్ కాయిన్ సెప్టెంబర్ - నవంబర్ మధ్య కాలంలో 69,000 డాలర్లను కూడా తాకింది.
బిట్ కాయిన్ ట్రేడర్స్ గత ఇరవై నాలుగు గంటల్లోనే 2.5 బిలియన్ డాలర్లు నష్టపోయారు. రెండో అతిపెద్ద క్రిప్టో ఎథేరియం 3,970.16 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. మెమోకాయిన్స్ షిబా ఇను, డోజికాయిన్ వరుసగా 11.98 శాతం, 9.13 శాతం నష్టపోయింది. అయితే ఆ తర్వాత షిబా ఇను ఓ సమయంలో ఏకంగా 25,000 శాతం కూడా లాభపడింది.
మెటా
రివార్డ్స్
టోకెన్
5,605.90
శాతం,
ఎలాన్
టెక్
668.50
శాతం,
ఫ్లోకి
ఎక్స్
332.12
శాతం,
పిఇను
281.52
శాతం,
ప్రిన్స్
ఫ్లోకి
వీ2
267.43
శాతం,
ప్రైమ్
కాయిన్
231.48
శాతం
లాభపడ్డాయి.
భారీగా
నష్టపోయిన
వాటిలో
జీఎంఆర్
ఫైనాన్స్
97.71
శాతం,
హీరోఫీ
89.46
శాతం,
ఆరాటా
87.72
శాతం,
ఎన్ఎఫ్
మోన్సాట్ర్
83.20
శాతం,
అనిమల్
టోకెన్
78.29
శాతం,
డిజిటల్
బ్యాంక్
ఆఫ్
ఆఫ్రికా
71.62
నష్టపోయాయి.