కరోనా మహమ్మారి ప్రభావంతో తొలిసారిగా జీఎస్టీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం వాయిదాకు కారణమైంది. జీఎస్టీ పరిహారం బకాయిల చెల్లింపుపై రాష్ట ప్రభుత్వాలు కేంద్రాన్ని నిలదీస్తున్న నేపథ్యంలో కేంద్రం ఏకంగా జీఎస్టీ సమావేశాన్ని వాయిదా వేసి తాత్కాలికంగా ఊరట పొందింది.
వాస్తవానికి జీఎస్టీ కౌన్సిల్ 42వ సమావేశం ఈ నెల 19న జరగాల్సి ఉంది. కానీ కేంద్రం, రాష్ట్రాల మధ్య జీఎస్టీ పరిహారం చెల్లింపు విషయంలో తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. ముఖ్యంగా కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతూ కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా చెప్పుకుంటున్నాయి. ఇదే కారణంతో జీఎస్టీ పరిహారం చెల్లింపును కేంద్రం వాయిదా వేస్తుండగా.. రాష్ట్రాలు ఇదే డిమాండ్తో కేంద్రాన్ని ఇరుకునపెడుతున్నాయి. ఈ ఏడాది తమకు 2.34 లక్షల కోట్ల పరిహారం బకాయి చెల్లించాల్సిందేనని విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు గట్టిగా పట్టుబట్టాయి. దీంతో కేంద్రం ఇరుకునపడింది.

సెప్టెంబర్ 19న జరగాల్సిన జీఎస్టీ కౌన్సిల్ భేటీకి ముందే రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో భేటీ జరిగితే ఎలాంటి పరిస్ధితి ఎదుర్కోవాల్సి వస్తుందో అన్న భయంతో కేంద్రం దీన్ని అక్టోబర్ మొదటి వారానికి వాయిదా వేసింది. కానీ రాష్ట్రాల వ్యతిరేకత నేపథ్యంలో ఈ విషయాన్ని బయటికి చెప్పకుండా పార్లమెంటు సమావేశాల పేరుతో కేంద్రం దీన్ని వాయిదా వేసేసింది. జీఎస్టీ పరిహారం చెల్లింపు కోసం కేంద్రం ప్రతిపాదిస్తున్న రెండు ఆప్షన్లనూ విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి.
ఇందులో కేరళ, పంజాబ్, పాండిచ్చేరి, తమిళనాడు, ఢిల్లీ, ఛత్తీస్ ఘడ్ ఉన్నాయి. ఇవి కాకుండా మధ్యప్రదేశ్, గుజరాజ్, బీహార్, కర్నాటక, త్రిపుర, గోవా మాత్రం 97 వేల కోట్ల మొత్తాన్ని అప్పుగా తీసుకునేందుకు సిద్దమయ్యాయి. ఈశాన్య రాష్ట్రాలైన సిక్కిం, మణిపూర్ మాత్రం రూ. 2.35 లక్షల కోట్లు అప్పులు స్వీకరించే రెండో ఆప్షన్కు సై అన్నాయి. ఏపీ, తెలంగాణ వంటి మరికొన్ని రాష్ట్రాలు మౌనంగా ఉన్నాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications