25 శాతం బైక్ విక్రయాలు పెరిగాయ్, హైదరాబాద్లో మాత్రం తక్కువే, కార్లు మాత్రం ఢమాల్..
కరోనా వైరస్ వల్ల కార్ విక్రయాలు పడిపోయిన.. బైక్ల విక్రయాలు మాత్రం పెరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే మే నెలలో 25 శాతం ఎక్కువగా బైక్లు విక్రయాలు జరిగాయి. అయితే టూ వీలర్స్ కొనుగోలు మాత్రం జిల్లాల్లోనే ఎక్కువగా ఉంది. హైదరాబాద్లో ఇప్పటికే చాలామందికి బండ్లు ఉండటం ఒక కారణమైతే.. మరికొందరు గ్రామాలకు వెళ్లడం మరో రీజన్.
సాయంత్రం నుంచే ఐఫోన్ 11 విక్రయాలు: ఏ ఫోన్ ధర ఎంతంటే?
వాస్తవానికి లాక్ డౌన్ వల్ల వేతన జీవుల ఉద్యోగాల్లో కోతపడింది. కానీ ఆటోలు, బస్సుల్లో ప్రయాణించాలంటే మాత్రం భయపడుతున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఉంది టూ వీలర్. అందుకే అప్పో సప్పు చేసి మరీ బండి కొనుగోలు చేస్తున్నారు. దీంతో సేఫ్గా ఉండొచ్చని భావిస్తున్నారు. అంతేకాదు కరోనా వైరస్ ప్రభావం ఇప్పట్లో వీడదని.. మరో ఆరు నెలలు ఉంటుందన్న ఊహాగానాల నేపథ్యంలో బైక్స్ పర్చేస్ చేస్తున్నారు.
చిత్రంగా హైదరాబాద్లో మాత్రం బైక్ సేల్స్ జిల్లాలతో పోలిస్తే తక్కువగా ఉన్నాయి. సిటీలో అందరికీ బైక్ ఉండగా.. మరికొందరు వర్క్ ఫ్రం హోం పేరుతో గ్రామాలకు వెళ్లిపోయారు. టూ వీలర్స్ విక్రయాలతో ఆర్టీఏకు కూడా ఆదాయం బారీగా పెరిగింది. గత నెల 16వ తేదీ నుంచి స్లాట్స్ ఓపెన్ అయిన సంగతి తెలిసిందే. తొలుత రోజుకు 10 వేల బుక్సింగ్స్ అవడంతో కోటిన్నర ఆదాయం సమకూరింది. కానీ ప్రస్తుతం కాస్త తగ్గడంతో రోజుకు రూ.7.5 కోట్ల ఆదాయం వస్తోంది.