బెంగళూరు: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ ఇటీవలి డేటా ప్రకారం మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల నుంచి వస్తున్న డైరెక్ట్ ట్యాక్స్ రెవెన్యూ 61 శాతంగా ఉంది. గుజరాత్, తమిళనాడు కూడా కలిస్తే ఈ ఐదు రాష్ట్రాల నుంచే 72 శాతం రెవెన్యూ వస్తోంది. ఛత్తీస్గఢ్, ఒడిశా, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు ఏడు రాష్ట్రాలను దక్షిణ భారత రాష్ట్రాలుగా చెబుతారు. మహారాష్ట్రను అటు నార్త్కు, ఇటు సౌత్కు మధ్యగా ఉంటుంది. దీనిని కూడా సౌత్ కిందకు తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాల నుంచి డైరెక్ట్ ట్యాక్స్ రెవెన్యూ 62శాతం వరకు ఉంది.

మహారాష్ట్రను కలుపుకుంటే దక్షిణాది నుంచి అధికం
ఇందులో దేశ ఆర్థిక రాజధాని ముంబై కలిగిన మహారాష్ట్ర నుంచే మూడొంతులు ఉండటం గమనార్హం. గత ఆరేళ్ల కాలంలో దక్షిణాది రాష్ట్రాల నుంచి దాదాపు రూ.12 లక్షల కోట్ల రెవెన్యూ ఉంటే కేవలం మహారాష్ట్ర నుంచి దాదాపు రూ.20 లక్షల కోట్ల రెవెన్యూ ఉంది. మహారాష్ట్రను కలుపుకుంటే 8 దక్షిణాది రాష్ట్రాల నుంచే యాభై శాతానికి పైగా ఉండటం గమనార్హం.

దక్షిణాది నుంచి ఏ రాష్ట్రం నుంచి ఎంత అంటే..
- తమిళనాడు - రూ.3.39 లక్షల కోట్లు
- కేరళ - రూ.0.80 లక్షల కోట్లు
- కర్ణాటక - రూ.4.99 లక్షల కోట్లు
- తెలంగాణ - రూ.0.23 లక్షల కోట్లు
- ఆంధ్రప్రదేశ్ - రూ.2.20 లక్షల కోట్లు
- చత్తీస్గఢ్ - రూ.0.21 లక్షల కోట్లు
- ఒడిశా - రూ.0.59 లక్షల కోట్లు
- మహారాష్ట్ర - రూ.19.17 లక్షల కోట్లు
మొత్తంగా డైరెక్ట్ ట్యాక్స్ రెవెన్యూ రూపంలో ఎనిమిది దక్షిణాది రాష్ట్రాల నుంచి రూ.31.58 లక్షల కోట్లుగా ఉంది.

మహారాష్ట్ర టాప్
2013-14 వరకు 2018-19 వరకు ఆరు ఆర్థిక సంవత్సరాలకు ప్రత్యక్ష పన్ను ఆదాయం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలు ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాల నుంచి 54 శాతంగా ఉండటం గమనార్హం. అయితే ఇందులోను దేశ ఆర్థిక రాజధాను ముంబై కలిగిన మహారాష్ట్ర నుంచే అధికం. మహారాష్ట్ర నుంచే రూ.19.17 లక్షల కోట్ల డైరెక్ట్ ట్యాక్స్ వచ్చింది. ఈ ఆరేళ్లలో మహారాష్ట్ర వాటా 37.85 శాతం కావడం గమనార్హం.

మూడు రాష్ట్రాల నుంచి 54 శాతం
మహారాష్ట్ర తర్వాత వరుసగా కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. కేరళ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలు 1 లక్ష కోట్ల కంటే దిగువన ఉన్నాయి. ఆరేళ్లలో మహారాష్ట్ర వాటా 37.85 శాతమైతే కర్ణాటక వాటా 9.8 శాతం, తమిళనాడు వాటా 6.7 శాతంగా ఉన్నాయి. ఈ మూడు కలిపి 54.3 శాతంగా ఉన్నాయి.

అయిదేళ్లలో రూ.50.67 లక్షల కోట్ల డైరెక్ట్ రెవెన్యూ ఆదాయం
గత ఆరేళ్లలో కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన మొత్తం డైరెక్ట్ ట్యాక్స్ ఆదాయం రూ.50.67 లక్షల కోట్లు. ఇందులో మహారాష్ట్ర కలుపుకుంటే దక్షిణాది నుంచి రూ.31.58 లక్షల కోట్లు. అంటే 62 శాతం వాటా ఉంది.
More From GoodReturns

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications