ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్ (DA) ఐదు శాతం పెంచుతూ దీపావళి పండుగ సందర్భంగా శుభవార్త చెప్పింది. దీంతో ఉద్యోగుల డీఏ 12 శాతం నుంచి 17 శాతానికి పెరిగింది. ఇది ఉద్యోగులకే కాదు పెన్షనర్లకు కూడా ప్రయోజనమే. ఎందుకంటే డియర్నెస్ అలవెన్స్తో పాటు డియర్నెస్ రిలీఫ్ కూడా పెరిగింది. కేంద్ర ప్రభుత్వం DA పెంపు నిర్ణయం వల్ల 62 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. దీని వల్ల వారికి పెన్షన్ మొత్తం పెరగనుంది.

రూ.1.25 లక్షల పెన్షన్ వస్తే రూ.6,250 పెంపు
డియర్నెస్ రిలీఫ్ (DR) పెరగడంతో పెన్షనర్లకు వచ్చే పెన్షన్ రూ.450 మొదలు రూ.6250 వరకు పెరగనుంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా DRను పెంచిందని చెబుతున్నారు. ఆలిండియా ఆడిట్ అండ్ అకౌంట్స్ అసోసియేషన్ అసిస్టెంట్ సెక్రటరీ మాట్లాడుతూ... గత కొన్నేళ్లలో ఇదే అత్యధికం అన్నారు. డియర్నెస్ రిలీఫ్ పెరగడంతో రూ.9,000 పెన్షన్ తీసుకునే వారికి రూ.450 పెరుగుతుందని, రూ.1.25 లక్షల పెన్షన్ తీసుకునే వారికి రూ.6,250 పెరుగుతుందన్నారు.

పెన్షన్ పెరుగుదల
2017 నుంచి మినిమం పెన్షన్/ఫ్యామిలీ పెన్షన్ రూ.9,000 నెలకు వస్తోంది. ఇది కాకుండా పరిహారం మొత్తాన్ని కూడా రెండింతలు చేశారు. కంపన్షేషన్ అమౌంట్ రూ.10.15 లక్షల నుంచి రూ.25.35 లక్షల వరకు పెరిగిందని చెప్పారు.

ఉద్యోగుల వేతనం రూ.12,500 వరకు పెరుగుదల
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గత మూడేళ్లలో అత్యధిక డిఏ లభించింది. ప్రస్తుతం డీఏ 12 శాతం ఉంది. గరిష్టంగా పెరుగుదల 3 శాతంగా ఉంది. ఇప్పుడు 12 శాతం నుంచి 17 శాతానికి పెంచారు. ఇది 5 శాతం. ఈ నేపథ్యంలో ప్రస్తుత డీఏ పెంపు ద్వారా ఉద్యోగుల వేతనం రూ.900 నుంచి రూ.12,500 వరకు పెరగనుంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications