ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పదవీ విరమణ వయస్సును అరవై ఏళ్లకు పెంచుతున్నట్లు తెలిపింది. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం నేపథ్యంలో కార్మికుల పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60 ఏళ్లకు పెంచాలని ఇప్పటికే నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. ఈ నెల నుంచి పదవి విరమణ చేయనున్న కార్మికులకు దీనిని వర్తింప చేయనున్నారు. దీనికి ముఖ్యమంత్రి జగన్ కూడా సానుకూలత వ్యక్తం చేశారు.

ఉద్యోగులకు దసరా కానుక
ఇది ఆర్టీసీ ఉద్యోగులకు దసరా కానుక. దీనిని ఈ నెల అంటే సెప్టెంబర్ నుంచే అమలు చేయనుండటం గమనార్హం. సెప్టెంబర్ 4వ తేదీన ఏపీఎస్ ఆర్టీసీ విలీనంపై ఆంజనేయరెడ్డి కమిటీ నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతి నెల ఆర్టీసీలు 200 నుంచి 300 మంది ఉద్యోగులు రిటైర్ అవుతున్నట్లుగా అంచనా. ఆర్టీసీ విలీన ప్రక్రియకు మూడు నెలల గడువు ఉన్న నేపథ్యంలో తమకు పదవీ విరమణ పెంపు వయస్సు వర్తించదనే ఆందోళనలో ఉన్న ఉద్యోగులకు ఇది పెద్ద శుభవార్త.

52వేల మందికి లబ్ధి
ఇదే విషయాన్ని కమిటీ చైర్మన్ ఆంజనేయ రెడ్డి ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకు వెళ్లగా ఆయన వెంటనే స్పందించారు. సెప్టెంబర్ నెల నుంచి 60 ఏళ్ల పెంపు వర్తించేలా ఆదేశించారు. దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడటమే ఆలస్యం. ఇటీవలే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అదే సమయంలో వయో పరిమితిని అరవై ఏళ్లకు పెంచింది. దీంతో ఆర్టీసీలోని 52వేల మందికి పైగా ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుంది.

ఎలక్ట్రిక్ బస్సులపై నివేదిక
మరోవైపు, ఆర్టీసీలో ఎలక్ట్రానిక్ బస్సులను ప్రవేశపెడితే పెద్ద ఎత్తున ఇంధనం ఆదా అవుతుందని విద్యుత్ బస్సులపై ఏర్పాటైన నిపుణుల కమిటీ తెలిపింది. వ్యయ నియంత్రణ, పర్యావరణ పరిరక్షణకు ఎలక్ట్రానిక్ బస్సులు ఉపయోగపడతాయని పేర్కొంది. శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్కు ఎలక్ట్రిక్ బస్సులపై నివేదికను సమర్పించింది. నిపుణుల కమిటీ చైర్మన్ ఆంజనేయ రెడ్డి, కమిటీ సభ్యులతో పాటు, ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు తదితరులు సీఎంను కలిశారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications