ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పదవీ విరమణ వయస్సును అరవై ఏళ్లకు పెంచుతున్నట్లు తెలిపింది. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం నేపథ్యంలో కార్మికుల పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60 ఏళ్లకు పెంచాలని ఇప్పటికే నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. ఈ నెల నుంచి పదవి విరమణ చేయనున్న కార్మికులకు దీనిని వర్తింప చేయనున్నారు. దీనికి ముఖ్యమంత్రి జగన్ కూడా సానుకూలత వ్యక్తం చేశారు.

ఉద్యోగులకు దసరా కానుక
ఇది ఆర్టీసీ ఉద్యోగులకు దసరా కానుక. దీనిని ఈ నెల అంటే సెప్టెంబర్ నుంచే అమలు చేయనుండటం గమనార్హం. సెప్టెంబర్ 4వ తేదీన ఏపీఎస్ ఆర్టీసీ విలీనంపై ఆంజనేయరెడ్డి కమిటీ నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతి నెల ఆర్టీసీలు 200 నుంచి 300 మంది ఉద్యోగులు రిటైర్ అవుతున్నట్లుగా అంచనా. ఆర్టీసీ విలీన ప్రక్రియకు మూడు నెలల గడువు ఉన్న నేపథ్యంలో తమకు పదవీ విరమణ పెంపు వయస్సు వర్తించదనే ఆందోళనలో ఉన్న ఉద్యోగులకు ఇది పెద్ద శుభవార్త.

52వేల మందికి లబ్ధి
ఇదే విషయాన్ని కమిటీ చైర్మన్ ఆంజనేయ రెడ్డి ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకు వెళ్లగా ఆయన వెంటనే స్పందించారు. సెప్టెంబర్ నెల నుంచి 60 ఏళ్ల పెంపు వర్తించేలా ఆదేశించారు. దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడటమే ఆలస్యం. ఇటీవలే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అదే సమయంలో వయో పరిమితిని అరవై ఏళ్లకు పెంచింది. దీంతో ఆర్టీసీలోని 52వేల మందికి పైగా ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుంది.

ఎలక్ట్రిక్ బస్సులపై నివేదిక
మరోవైపు, ఆర్టీసీలో ఎలక్ట్రానిక్ బస్సులను ప్రవేశపెడితే పెద్ద ఎత్తున ఇంధనం ఆదా అవుతుందని విద్యుత్ బస్సులపై ఏర్పాటైన నిపుణుల కమిటీ తెలిపింది. వ్యయ నియంత్రణ, పర్యావరణ పరిరక్షణకు ఎలక్ట్రానిక్ బస్సులు ఉపయోగపడతాయని పేర్కొంది. శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్కు ఎలక్ట్రిక్ బస్సులపై నివేదికను సమర్పించింది. నిపుణుల కమిటీ చైర్మన్ ఆంజనేయ రెడ్డి, కమిటీ సభ్యులతో పాటు, ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు తదితరులు సీఎంను కలిశారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications