ఢిల్లీ: ప్రభుత్వరంగ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (EESL) అపోలో హాస్పిటల్స్తో విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లకు సంబంధించి పదేళ్ల ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. దేశంలోని అన్ని అపోలో హాస్పిటల్స్ల్లో ప్రజా విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు ఈ MoU కుదిరింది. దేశంలోని ప్రజా విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు ఓ ప్రైవేటు భాగస్వామితో ఎంవోయు కుదుర్చుకోవడం ఇదే తొలిసారి. ఈ విషయాన్ని EESL ఓ ప్రకటనలో తెలిపింది.

పెట్టుబడి, మానవవనరులు...
అపోలో హాస్పిటల్స్తో పదేళ్ల కోసం ఎంవోయు కుదుర్చుకున్నట్లు ఆదివారం రోజున EESL తెలిపింది. ఈ MoU ప్రకారం విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లకు అవసరమైన మౌలిక సదుపాయాలు, మానవ వనరుల్ని, పెట్టుబడిని EESL ముందే సమకూర్చుతుంది. ఛార్జింగ్ స్టేషన్లకు అవసరమైన స్థలం ఇవ్వడంతో పాటు విద్యుత్తు కనెక్షన్లను అపోలో హాస్పిటల్స్ సమకూర్చవలసి ఉంటుంది.

ఎలక్ట్రిక్ వాహనాలపై అవగాహన, విశ్వాసం పెంచేందుకు...
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై ప్రజలకు మరింత అవగాహన, విశ్వాసం కలిగించేందుకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సిన అవసరముందని EESL తెలిపింది. ఎలక్ట్రిక్ వెహికిల్స్ విషయంలో ప్రైవేటు రంగం పాత్రను ప్రోత్సహించాలనే నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రోగ్రాం లక్ష్యాల్ని అపోలో హాస్పిటల్స్తో తమ ఎంవోయూ బలోపేతం చేస్తుందని తెలిపింది.

అందుకే అపోలోతో ఒప్పందం
విద్యుత్ వాహనాలపై వినియోగదారుల్లో విశ్వాసం పెంపొందించేందుకు మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, అందులో భాగంగా అపోలో హాస్పిటల్స్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. వాయు ఉద్గారాలను తగ్గించేందుకు, గాలి నాణ్యతను పెంచేందుకు విద్యుత్ మొబిలిటి అవశ్యమని EESL డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) వెంకటేష్ ద్వివేది అన్నారు. అపోలో హాస్పిటల్స్ విద్యుత్, స్థలం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications