అమరావతి: ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం దాదాపు 22 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా రెండు లక్షల మందికి పైగా దరఖాస్తు చేశారు. విజయనగరం జిల్లా నుంచి తక్కువ దరఖాస్తులు వచ్చాయి. వీరికి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఆరు రోజుల పాటు రాత పరీక్షలు నిర్వహిస్తారు. 2, 5వ తేదీలు మినహా 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు పరీక్షలు ఉంటాయి. ఈ దరఖాస్తులకు తొలుత శనివారం రాత్రి వరకు గడువు ఉండగా, ఆదివారం రాత్రి వరకు పొడిగించారు. దీంతో మరో అరవై వేల దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి.

రాత పరీక్ష చిక్కు... పరీక్షకు హాజరయ్యేందుకు అర్హత
దరఖాస్తు పీజు చెల్లించిన వారు మాత్రమే పరీక్షకు హాజరయ్యేందుకు అర్హత ఉంటుంది. 22.69 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకోగా 21.69 లక్షల మంది మాత్రమే ఫీజులు చెల్లించారు. అలాగే, 13 జిల్లాల్లో ఎక్కడా స్థానికతకు అర్హత లేని వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నా రాత పరీక్షకు అనర్హులు. వారికి హాల్ టిక్కెట్లు కూడా జారీ చేసే అవకాశం లేదు. ఈ ఉద్యోగాలకు ఆరువేల మందికి పైగా రాష్ట్రేతరులు కూడా దరఖాస్తు చేసుకున్నారు.

తెలంగాణలో చదివినప్పటికీ.. వీరికి ఓకే
రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణ ప్రాంతంలో చదివి, విభజన తర్వాత నిబంధనల మేరకు ఏపీ స్థానికతను అధికారికంగా పొందిన వారికి మాత్రం రాత పరీక్షకు హాజరయ్యే అవకాశం కల్పిస్తారు. మిగతా వారికి ఆ అవకాశం ఉండదు. రాత పరీక్ష కోసం 8వేలకు పైగా పరీక్షా కేంద్రాలను, 50 వేలకు పైగా గదులను సిద్ధం చేస్తున్నారు. 16 మంది, 24 మంది, 48 మంది అభ్యర్థులకు ఓ గది చొప్పున పరీక్షా కేంద్రాలు సిద్ధం చేస్తున్నారు.

పరీక్ష తేదీలు...
సెప్టెంబర్ 1వ తేదీన కేటగిరి 1 ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసిన వారికి పరీక్ష నిర్వహిస్తారు. 13 జిల్లాల్లోని తాలుకా, మండల కేంద్రాల్లో కలిపి ఉదయం కొందరికి, మధ్యాహ్నం కొంతమందికి రాత పరీక్ష నిర్వహిస్తారు. గ్రామ ఇంజినీరింగ్ కార్యదర్శి, వార్డు సౌకర్యాల కార్యదర్శి, వీఆర్వో పోస్టులకు దరఖాస్తు చేసినవారికి 3, 4 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారు. మిగతా కేటగిరీల్లోని ఉద్యోగులకు రోజుకు లక్షమంది చొప్పున 6, 7, 8 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారు.

కేటగిరీ 1 ఉద్యోగాలకు అత్యధిక దరఖాస్తులు
కేటగిరీ 1లో పేర్కొన్న నాలుగు రకాల ఉద్యోగాలకు కలిపి నిర్వహించే ఒకే రకమైన రాతపరీక్షకు అత్యధిక దరఖాస్తులు వచ్చాయి. కేటగిరీలో పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 5, గ్రామ, వార్డు మహిళా పోలీసు, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ ఉద్యోగాలు ఉన్నాయి.

ఇతర కేటగిరీలకు...
కేటగిరీ 2(ఏ)లో ఇంజినీరింగ్ అసిస్టెంట్, వార్డు ఎమినిటీస్ సెక్రటరీ ఉద్యోగాలకు దాదాపు లక్షన్నర మంది, కేటగిరీ 2(బీ)లో వీఆర్వో, సర్వే అసిస్టెంట్ ఉద్యోగాల కోసం లక్షా డెబ్బై వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. కేటగిరీ 3లో మిగిలిన 11 రకాల ఉద్యోగాలు ఉండగా, ఇందుకోసం ఆరున్నర లక్షలకు పైగా దరఖాస్తు చేసుకున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications