ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించిన సూపర్ రిచ్ టాక్స్ లేదా సెస్ ... ఏకంగా 43 % నికి పెరిగిపోవటంతో... దేశంలోని ప్రముఖ కార్పొరేట్ కంపెనీలకు కొత్త చిక్కు వచ్చి పడింది. ఈ నిర్ణయం తో కంపెనీల బాస్ ల వేతనాలను సవరించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఎందుకంటే ... గతంలో కంటే వారికీ పన్ను బాదుడు ఎక్కువ అవటం వల్ల ... ఆ మేరకు వేతనం పెంచక పెంచాల్సి ఉంటుంది. ఎండీ , సీఈఓ, ప్రెసిడెంట్ స్థాయి ఉన్నతాధికారులకు వేతనాలు కోట్లలోనే ఉంటాయి. ఆర్ధిక మంత్రి రూ 2 కోట్లు ఆపైన ఆదాయం ఉన్నవారికి పన్ను పై సర్చార్జీ పెంచగా... రూ 5 కోట్లు అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్న వాళ్లకు బడుగు మరింత ఎక్కువైంది. దీంతో అటు ఉన్నతాధికారులు, ఇటు కంపెనీలు తలలు పట్టుకొంటున్నాయి.

వారి సంపాదన రూ 11 కోట్ల పైనే...
భారత్ లోని స్టాక్ మార్కెట్లో లిస్ట్ ఐన కొన్ని కంపెనీల బాస్ ల శాలరీ తీసుకొంటే కళ్ళు చెదిరే రేంజ్ లో ప్యాకేజీ ఉంటున్నాయి.ఉదాహరణకు బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి 500 కంపెనీలు తీసుకొంటే అందులో 144 మంది ఉన్నధికారుల వేతనాలు సగటున రూ 11.4 కోట్లుగా తేలినట్లు టైమ్స్ ఒక కథనంలో వెల్లడించింది. కొత్తగా ప్రతిపాదించిన పన్ను స్లాబుల ప్రకారం... ఇలాంటి సూపర్ రిచ్ ఎగ్జిక్యూటివ్ లకు సరాసరి 20% వరకు టేక్ హోమ్ శాలరీ తగ్గిపోనుందట. ఇది కూడా ఒక ప్రముఖ కంపెనీ సీఈఓ వెల్లడించిన వాస్తవం. మరి అదే రేంజ్ లో కంపెనీలు వారికీ న్యాయం చేయాల్సి ఉంటుంది. దీంతో కంపెనీలపై కనీసం 10% నుంచి 20% వరకు అదనపు భారం పడనుందని... తద్వారా కంపెనీల లాభదాయకతపై ఆ మేరకు ప్రభావం ఖచ్చితంగా ఉంది తీరుతుందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బాదుడే ... బాదుడు...
ఈ ఏడాది బడ్జెట్ లో సామాన్యుడిపై కాస్త కనికరం చూపించిన ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ... సంపన్నులపై మాత్రం కొరడా ఝుళిపించిందనే చెప్పాలి. రూ 2 కోట్ల నుంచి రూ 5 కోట్ల వరకు ఆదాయ ఉన్న వారిపై సర్చార్జీ ని 15% నుంచి 25% పెంచటంతో... వారిపై పన్ను రేటు గతంలోని 35.88% నుంచి 39% నికి పెరిగిపోయింది. ఇక రూ 5 కోట్లు అంతకంటే అధిక ఆదాయం ఉన్నవారి పరిస్థితి అయితే చెప్పనక్కర లేదు. వారిపై ఏకంగా సర్చార్జీ ని ఏకంగా 15% నుంచి 37% శాతాన్ని పెంచటం తో... వారి పన్ను రేటు అత్యధికంగా 42. 7% నికి ఎగబాకింది. 1992 తర్వాత ఇంతటి పన్ను రేటు భారత్ లో ఉండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ఇండియా లో రిచ్ సీఈఓ సీపీ గుర్నాని ....
ఇండియా లోని కార్పొరేట్ కంపెనీల్లో అతయధిక వేతనం పొందుతున్న సీఈఓ ల్లో ఓపీ గుర్నాని ముందున్నారు. ఆయన టెక్ మహీంద్రా కంపెనీకి సీఈఓ గా కొనసాగుతున్నారు. గుర్నాని వార్షిక వేతనం ఏకంగా రూ 146 కోట్లు కావడం విశేషం. ఆ తర్వాతి స్థానంలో రూ 137 కోట్ల వార్షిక వేతనం తో ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ చైర్మన్ ఏఎం నాయక్ నిలిచారు. మన దేశంలో అత్యంత సంపన్నుడు ... రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మాత్రం కొన్నేళ్లుగా స్థిరంగా రూ 15 కోట్ల వేతనాన్ని తీసుకొంటున్నారు.

50,000 నుంచి 1,00,000 మంది...
అయితే మన దేశంలో రూ 1 కోటి అంత కంటే ఎక్కువ పన్ను చెల్లించే వారి సంఖ్యా 50,000 నుంచి 1,00,000 మధ్య ఉంటుందని అనధికారిక అంచనాలు ఉన్నాయి. వీరందిపై కొత్త పన్ను విధానం భారీ ప్రభావాన్నే చూపనుంది. వ్యక్తిగతంగా ఎగ్జిక్యూటివ్ లు కొంత మేరకు నష్టపోతే, కంపెనీలపై దీని ప్రభావం ఎక్కువగా పడుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. చూడాలి మరి దీని ప్రభావం ఎలా ఉంటుందో.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!



Click it and Unblock the Notifications