న్యూఢిల్లీ: దేశంలోని డ్రైవింగ్ లైసెన్స్లలో 30శాతం ఫేక్ అని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ లోకసభలో వెల్లడించారు. ప్రపంచంలోనే సులభంగా డ్రైవింగ్ లైసెన్స్ పొందగలిగే సౌకర్యం భారతదేశంలో ఉందని, ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ సులభంగా పొందవచ్చునని, లైసెన్స్ పైన ఫోటోగ్రాప్స్ చూస్తే కొన్ని మ్యాచ్ కావడం లేదని చెప్పారు. ప్రజలు ఎలాంటి భయం లేకుండా, చట్టంపై గౌరవం లేకుండ్ డ్రైవింగ్ చేస్తున్నారన్నారు. రూ.50, రూ.100 చలాన్లను ఎవరు కూడా లెక్క చేయడం లేదన్నారు.

డ్రైవింగ్ లైసెన్స్కు ఆధార్ తప్పనిసరి కాదు
డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆధార్ ధృవీకరణను నిలిపివేస్తున్నట్లు గడ్కరీ రాజ్యసభలో తెలిపారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ సమాచారం మేరకు ఆధార్ కలిగిన డ్రైవింగ్ లైసెన్స్లు, ఆధార్కతో కూడిన వాహన రిజిస్ట్రేషన్లు కోటిన్నరకు పైగా చొప్పున ఉన్నాయని చెప్పారు. టీఆర్ఓల వద్ద బయోమెట్రిక్ సేకరణ ప్రక్రియ నిలిపేస్తున్నట్లు తెలిపారు.

యూపీలో ఎక్కువ ఎలక్ట్రిక్ వెహికిల్స్
2030 నాటికి భారత్లో 30 శాతం ఎలక్ట్రిక్ వాహనాలు ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని గడ్కరీ చెప్పారు. జూలై 9వ తేదీ వరకు ఇండియాలో 3.97 లక్షల రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్/బ్యాటరీ వెహికిల్స్ ఉన్నట్లు తెలిపారు. అన్ని రాష్ట్రాల్లోకెల్లా యూపీలో ఎక్కువగా 1.39 లక్షల EV వెహికిల్స్ ఉన్నట్లు చెప్పారు. ఆ తర్వాత ఢిల్లీలో 75 వేలకు పైగా, కర్ణాటకలో దాదాపు 32 లక్షలు ఉన్నాయి. అతి తక్కువగా అంటే అరుణాచల్ ప్రదేశ్లో 13, దాద్రా నగర్ హవేలీలో 14, మేఘాలయలో 17, మిజోరాంలో 18 ఉన్నాయి.

వాహన చట్టంలో సవరణలు
వాహన చట్టంలో సవరణలు చేస్తూ ప్రతిపాదనలు చేశారు. ఇందులో జరిమానాలు భారీగా పెంచారు. ఈ కొత్త బిల్లు ప్రకారం నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రస్తుతం ఉన్నదాని కంటే పదిరెట్ల జరిమానా విధిస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే రూ.5,000 వరకు ఫైన్ వేయనున్నారు. మద్యం తాగి వాహనం నడిపితే రూ.10,000 వరకు, డేంజరస్ డ్రైవింగ్కు రూ.5,000 విధిస్తారు.
More From GoodReturns

నేస్తం నేనున్నా.. భారత్కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications