హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభవార్త. త్వరలో అందరికీ ఉచితంగా వైద్యం అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకు ప్రజలు రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా, మొత్తం ప్రభుత్వం భరిస్తుందట. వంద శాతం ఫ్రీ మెడికల్ సేవలు అందించేందుకు యూనివర్సల్ హెల్త్ ప్రొటక్షన్ స్కీం అమల్లోకి తీసుకు వచ్చే యోచన చేస్తోంది. తెలంగాణలో ఇప్పటికే వివిధ హెల్త్ స్కీమ్లు ఉన్నాయి.

ఒకే గొడుకు కిందకు హెల్త్ స్కీంలు అన్నీ
ఇప్పటికే ఉన్న హెల్త్ స్కీంలన్నింటిని ఒకే గొడుగు కిందకు తెచ్చి సింగిల్ విండో విధానంలో అమలు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆరోగ్యశ్రీ, జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్, ఆరోగ్య భద్రత, ఆర్టీసీ, సింగరేణి, ఈఎస్ఐ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల కోసం ఖర్చు చేస్తున్నారు. వీటికి ఏడాదికి రూ.2వేల కోట్లకు పైగా ఖర్చవుతున్నాయని అంచనా. అయితే ఈ కొత్త స్కీం ద్వారా ఫండ్స్ సద్వినియోగం కావడంతో పాటు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

కొత్త ప్రతిపాదనలు
వివిధ ఆరోగ్య పథకాల కింద దాదాపు కోటి కుటుంబాలకు వైద్య సేవలు అందుతున్నాయి. అన్నింటిని యూనివర్సల్ హెల్త్ ప్రొటక్షన్ స్కీం (సార్వజనీన ఆరోగ్య పథకం) గొడుకు కిందకు తీసుకువస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఆరోగ్యశ్రీ మినహా మిగిలిన ఏ పథకం అమల్లోను ఆన్లైన్ సమాచారం పొందుపర్చడం లేదు. ఆయా ప్రాంతాల్లో ఎలాంటి వ్యాధులు ప్రబలుతున్నాయి, వారికి అందుతున్న వైద్యసేవలు.. వంటి వివరాలు లేవు. అన్నింటిని పరిగణలోకి తీసుకొని వైద్య ఆరోగ్య శాఖ కొత్త ప్రతిపాదన సిద్ధం చేసిందట.

ఆయుష్మాన్ భారత్లో చేరి.. ఉచిత వైద్య సేవలు
ఈ అంశంపై వైద్య ఆరోగ్య శాఖమంత్రి ఈటెల రాజేందర్ ఇటీవల అధికారులతో చర్చించారు. అన్ని పథకాలను ఒకే గొడుగు కిందకు తీసుకు రావడం ద్వారా ప్రజలకు ఉచితంగా వైద్యం అందించవచ్చునని అభిప్రాయపడ్డారు. అలాగే, నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయుష్మాన్ భారత్లో చేరే అంశంపై కూడా చర్చించారు. ఆయుష్మాన భారత్ వల్ల 20 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఈ నేపథ్యంలో అందులో చేరితే ఆ మేరకు నిధులు వచ్చే అవకాశాలపై చర్చించారు. తెలంగాణలో సుమారు కోటి కుటుంబాలు ఉండగా, హెల్త్ స్కీంల పరిధిలో రాకుండా స్వచ్చంధంగా బీమా సంస్థల ద్వారా లేదా సొంతగా వైద్య సేవల కోసం ఖర్చు పెడుతున్న కుటుంబాలు లక్ష కుటుంబాల వరకు ఉంటుందని అంచనా వేశారు. అందరికీ కలిపి యూనివర్సల్ హెల్త్ ప్రొటక్షన్ స్కీం తీసుకు వస్తే.. ఆయుష్మాన్ భారత్ సహకారంతో తెలంగాణలోని వారందరికీ ఉచిత వైద్య సేవలు అందించినట్లవుతుందనే అంశంపై చర్చించారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications