న్యూఢిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త బీకే బిర్లా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మెన్ బసంత్ కుమార్ బిర్లా బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 98 ఏళ్లు. బీకే బిర్లా గ్రూప్ ఆఫ్ కంపెనీస్కు ఛైర్మెన్గా వ్యవహరించడంతో పాటు కృష్ణార్పణ్ చారిటీ ట్రస్టు, పలు విద్యాసంస్థలకు కూడా అధినేతగా వ్యవహిరించారు. దేశంలో పేరుగాంచిన బీకే బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ బసంత్ కుమార్ బిర్లా నేతృత్వంలోనే నడిచింది. 1921 జనవరి 12న బీకే బిర్లా జన్మించారు.
ఒక్క భారత్లోనే కాకుండా విదేశాల్లో కూడా బిర్లా గ్రూప్ ఆఫ్ కంపెనీస్కు చెందిన సంస్థలున్నాయి. ఖతార్లో బిర్లా పబ్లిక్ స్కూలును బీకే బిర్లా ఏర్పాటు చేశారు. కళ్యాణ్లో బీకే బిర్లా కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, కామర్స్ అండ్ సైన్స్ను కూడా ఏర్పాటు చేసి విద్యార్థులకు విద్యనందించి మంచి విద్యావేత్తగా పేరుగాంచారు బీకే బిర్లా. ప్రముఖ సామాజికవేత్త జీడీ బిర్లాకు చివరి సంతానం బీకే బిర్లా. చిన్నతనం నుంచే తమకున్న వ్యాపారాలు సంస్థల్లో చాలా చురుకైన పాత్ర పోషించేవారు బీకే బిర్లా.ఆ తర్వాత చిన్నగా ఎదిగి కేశోరాం ఇండస్ట్రీస్కు ఛైర్మెన్ అయ్యారు.

ఇండో - ఇథియోపియన్ టెక్స్టైల్స్ షేర్ కంపెనీని స్థాపించిన తొలి భారతీయ పారిశ్రామికవేత్తగా బీకే బిర్లా గుర్తింపుపొందారు. ఇది భారత్ ఇథియోపియాల సంయుక్త ప్రాజెక్టు. ఈ కంపెనీ ఏర్పాటు తర్వాత ఇథియోపియా చక్రవర్తి ఒకటవ హేల్ సెలస్సీ ఆదేశ అత్యేన్నత అవార్డు ది మెడల్ ఆఫ్ ది మెనెలిక్-IIతో గౌరవించారు. ఇదిలా ఉంటే బీకే బిర్లాకు జయశ్రీ మెహతా, మంజుశ్రీ ఖైతాన్ అనే ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఆదిత్య విక్రం బిర్లా ఉన్నారు. ఆదిత్య విక్రం బిర్లా కుమారుడే కుమార మంగళం బిర్లా. ఆదిత్య విక్రం బిర్లా 1995 అక్టోబర్లో మృతి చెందారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications