న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంతో సర్వీసులను తాత్కాలికంగా మూసివేసిన జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్కు షాక్ తగిలింది. పన్ను ఎగవేత ఆరోపణలు రావడంతో ఆయనకు ఆదాయపన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. రూ.650 కోట్ల పన్ను ఎగవేత కేసులో ఆయనను అధికారులు ప్రశ్నించారని తెలుస్తోంది.
జెట్ ఎయిర్వేస్, దుబాయ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న గ్రూప్ కంపెనీల మధ్య ఈ పన్ను ఎగవేత లావాదేవీలు జరిగినట్లు ఐటీ డిపార్ట్మెంట్లోని దర్యాప్తు విభాగం గుర్తించింది. ఈ ఎయిర్లైన్స్ దుబాయ్లోని జనరల్ సేల్స్ ఏజెంట్లకు కమీషన్ల రూపంలో భారీ మొత్తాలు చెల్లించినట్లు డిపార్ట్మెంట్ దృష్టికి వచ్చింది.

జెట్ ఎయిర్వేస్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఐటీ శాఖ దర్యాఫ్తు చేపట్టింది. గత ఏడాది సెప్టెంబరులో ముంబైలో జెట్ ఎయిర్వేస్ ఆఫీసులో అధికారులు సోదాలు జరిపి పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ దర్యాఫ్తు ఫిబ్రవరిలో ముగిసింది. అందుకు సంబంధించిన రిపోర్టును అసెస్మెంట్ వింగ్కు పంపించారు. జెట్ ఎయిర్వేస్, దుబాయ్లోని ఎయిర్ లైన్ గ్రూప్ కంపెనీకి మధ్య అక్రమ లావాదేవీలు జరిగాయని దర్యాఫ్తులో గుర్తించారు. దుబాయ్లోని ఏజెంటుకు జెట్ ఎయిర్వేస్ ప్రతి సంవత్సరం భారీ మొత్తంలో కమిషన్లు ముట్టచెప్పినట్టు దర్యాఫ్తు నివేదికలో పేర్కొన్నారు. ఆదాయపన్ను చట్టం కింద ఉన్న పరిమితులను దాటి ఈ చెల్లింపులు జరిగినట్లు తేలింది.
ఐటీ శాఖ దర్యాఫ్తు విభాగ నివేదిక ప్రకారం... జెట్ తన ఏజెంట్లకు ఐటీ చట్టం పరిమితికి మించి కమీషన్లు చెల్లించింది. దీంతో వీటిని అనుమతి చెల్లింపులుగా పరిగణించాలని పేర్కొంది. ఇవి పన్నులు ఎగవేసేందుకు విదేశాలకు నిధుల మళ్లించే వ్యూహంతో జరిపిన చెల్లింపులని, దర్యాప్తులో వెల్లడైన వివరాల ఆధారంగా సమన్లు జారీ చేయడం జరిగిందని సంబంధిత అధికారి ఒకరు చెప్పారని తెలుస్తోంది.
జెట్ ఎయిర్వేస్ జూన్ త్రైమాసిక ఫలితాల ప్రకటనలను ఆలస్యం చేస్తున్న సమయంలో ఈ సర్వే జరిగింది. పన్నును ఎగవేసేందుకు విదేశాలకు నిధులను మళ్ళించాలనే ఉద్దేశ్యంతోనే ఈ చెల్లింపులు జరిగాయని, ఈ చెల్లింపులపై ప్రశ్నించేందుకు నరేష్ గోయల్కు నోటీసులు ఇచ్చామని ఐటీ అధికారులు తెలిపారు. దీనిపై జెట్ ఎయిర్వేస్ స్పందించాల్సి ఉంది.
More From GoodReturns

Layoffs: కోడింగ్ చేసే రోజులు పోయాయా? లేఆఫ్స్ భయాల మధ్య TCS సీఈఓ కీలక వ్యాఖ్యలు!

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!



Click it and Unblock the Notifications